Konaseema: డాక్టర్ కోర్సు చదివి ఇదేం పనిరా రాస్కెల్.. సెవెన్త్ క్లాస్ బాలిక టెర్రస్‌పై నిద్రిస్తుండగా..

| Edited By: Ravi Kiran

May 04, 2022 | 5:07 PM

డియర్ పేరెంట్స్.. మీ బిడ్డలను జాగ్రత్తగా చూసుకోండి. వారి ప్రవర్తనలో తేడా వస్తే వెంటనే సమస్య ఏంటో తెలుసుకోండి. భయం లేకుండా ప్రతి విషయం మీతో పంచుకునేలా ప్రేమగా మెలగండి.

Konaseema: డాక్టర్ కోర్సు చదివి ఇదేం పనిరా రాస్కెల్.. సెవెన్త్ క్లాస్ బాలిక టెర్రస్‌పై నిద్రిస్తుండగా..
Ap Crime News
Follow us on

AP news: డియర్ పేరెంట్స్.. మీ బిడ్డలను జాగ్రత్తగా చూసుకోండి. వారి ప్రవర్తనలో తేడా వస్తే వెంటనే సమస్య ఏంటో తెలుసుకోండి. భయం లేకుండా ప్రతి విషయం మీతో పంచుకునేలా ప్రేమగా మెలగండి. ఎందుకంటే బయట కామాంధులు ఎక్కువైపోయారు. ఎటువైపు నుంచి ఏ కీచకుడు వచ్చి కాటేస్తాడో తెలీదు. బడి, ఆస్పత్రి, హాస్టల్ ఎక్కడా ఆడబిడ్డలకు సేఫ్టీ లేకుండా పోయింది. తాజాగా వైద్యం ముసుగులో PMP డాక్టర్ లైంగిక వేధింపులు కోనసీమ జిల్లాలో కలకలం రేపుతున్నాయి. మామిడికుదురు(Mamidikududru) మండలం పెదపట్నంలంక గ్రామానికి చెందిన సెవెన్త్‌ క్లాస్‌ విద్యార్థినిపై PMP డాక్టర్ వేగి రమేష్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఈ విషయం విద్యార్థిని పేరెంట్స్‌కి చెప్పడంతో వాళ్లు పోలీసులను ఆశ్రయించారు. దాంతో పోలీసులు ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వేగి రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వైద్యం పేరుతో క్లినిక్‌కి వస్తున్న రోగులకు మాయమాటలు చెప్పి..వారి ఫోన్‌ నెంబర్లు తీసుకునేవాడు వేగి రమేష్‌. ఆ తర్వాత మెళ్లిగా వారిని తన ట్రాక్‌లోకి తీసుకొని అఘాయిత్యాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది.

 

Also Read: Viral: వాయమ్మో..! ఎంత పిచ్చి ప్రేమ అమ్మాయ్.. లవర్ కోసం మరీ ఇలానా..?