Pawan Kalyan: జనసేన అభ్యర్థులకు బీ ఫాంలు అందజేసిన పవన్.. తొలి బీ ఫాం ఎవరికంటే..?
ఎన్నికల కదనరంగలో కూటమి నేతలు దూసుకెళ్తున్నారు. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. జిల్లాల్లో వరుస పర్యటనలతో కేడర్ను ఆకట్టుకునేలా వ్యూహాలకు పదునుపెడుతున్నారు.
ఎన్నికల కదనరంగలో కూటమి నేతలు దూసుకెళ్తున్నారు. ఓ వైపు టీడీపీ అధినేత చంద్రబాబు.. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. బీజేపీ చీఫ్ పురంధేశ్వరి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. జిల్లాల్లో వరుస పర్యటనలతో కేడర్ను ఆకట్టుకునేలా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఈ క్రమంలోనే.. పవన్ కల్యాణ్ బుధవారం జనసేన అభ్యర్థులకు బీఫామ్లు అందించారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో 21 అసెంబ్లీ, ఇద్దరు ఎంపీ అభ్యర్థులకు బీఫామ్లు అందజేశారు.
తొలి బీఫామ్ను పవన్ కల్యాణ్ నాదెండ్ల మనోహర్కు అందజేశారు. ఈ సందర్బంగా జనసేన అభ్యర్థులతో ప్రమాణం చేయించారు. అవినీతి పాలన అంతం కోసమే కూటమి ఏర్పాటు చేశామని.. ప్రజలకు జవాబుదారీగా ఉంటామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. శ్రీరామనవమి రోజున అభ్యర్థులకు బీఫామ్లు ఇవ్వడం సంతోషకరమన్నారు. రాష్ట్రాన్ని రామరాజ్యం వైపు తీసుకెళతామని పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయమన్నారు కాకినాడ జనసేన పార్లమెంట్ అభ్యర్థి ఉదయ్ శ్రీనివాస్. పిఠాపురంలో పవన్ కల్యాణ్ ఘనవిజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..