30 April 2024
TV9 Telugu
FY24లో ATMల నుండి భారతదేశం యొక్క నగదు ఉపసంహరణలు 5.51% పెరిగాయని CMS ఇన్ఫోసిస్టమ్స్ నివేదిక చూపిస్తుంది.
భారత్.. మళ్లీ నగదు లావాదేవీల వైపు వెళ్తున్నదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. నగదు లావాదేవీలు మరింతగా పెరిగిపోతున్నాయి.
దేశంలో గత ఆర్థిక సంవత్సరం (2023-24) ఏటీఎంల నుంచి నెలవారీ నగదు ఉపసంహరణల సగటు రూ.1.43 కోట్లుగా ఉందని ప్రముఖ క్యాష్ లాజిస్టిక్స్ కంపెనీ సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ తెలిపారు.
ఓవైపు యూపీఐ పేమెం ట్స్ రికార్డు స్థాయిలో జరుగుతున్నా.. ప్రజల్లో నగదు వినియోగానికున్న ప్రాముఖ్యత స్పష్టంగా కనిపిస్తుండటం గమనార్హం.
ఇక అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 2023-24లో ఏటీఎంల్లో 5.51 శాతం క్యాష్ విత్డ్రాయల్స్ పెరిగాయని సీఎంఎస్ ఇన్ఫోసిస్టమ్స్ తమ నివేదిక తెలిపింది.
నాడు రూ.1.35 కోట్లేనని తెలిపింది. ముఖ్యంగా మెట్రో నగరాల్లో నగదు ఉపసంహరణలు పెరగడం విశేషంగా చెప్పుకోవచ్చు.
గతంతో చూస్తే 10.37 శాతం పెరిగాయి. సెమీ-అర్బన్, రూరల్ ఏరియాల్లో 3.94 శాతం, సెమీ-మెట్రో నగరాల్లోనూ 3.73 శాతం పెరిగాయి.
న్యూఢిల్లీ (రూ.1.82 కోట్లు), పశ్చిమ బెంగాల్ (రూ.1.62 కోట్లు) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. రూ.1.83 కోట్లతో కర్నాటక ముందుంది.