CM YS Jagan: జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. సీఎం జగన్ సుడిగాలి పర్యటన.. ఇవాళ ఎక్కడెక్కడంటే..

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన కొనసాగిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకు మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ మళ్లీ అధికారం ఇస్తే, వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో చెబుతూ ముందుకు సాగుతున్నారు.

CM YS Jagan: జోరందుకున్న ఎన్నికల ప్రచారం.. సీఎం జగన్ సుడిగాలి పర్యటన.. ఇవాళ ఎక్కడెక్కడంటే..
Ys Jagan With Fan
Follow us

|

Updated on: Apr 30, 2024 | 7:13 AM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం ముగియడంతో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి. ఈ క్రమంలోనే ముఖ్యమంత్కి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుడిగాలి పర్యటన కొనసాగిస్తూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. రోజుకు మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. విపక్షాలపై విమర్శలు గుప్పిస్తూ మళ్లీ అధికారం ఇస్తే, వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో చెబుతూ ముందుకు సాగుతున్నారు. ఇవాళ మరో మూడు నియోజకవర్గాల్లో పర్యటిస్తారు జగన్‌ .

ఏపీ సీఎం జగన్‌ ఇవాళ మూడు పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలకు ఒంగోలు పార్లమెంట్ పరుధిలోని కొండపి నియోజకవర్గంలో పర్యటిస్తారు. టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు సీఎం. ఇప్పటికే కూటమి నేతలపై విరుచుకుపడుతూ వైసీపీ పాలనలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తున్నారు ముఖ్యమంత్రి. టంగుటూరులోనూ విపక్షాలపై మాటల దాడికి దిగే అవకాశం ఉంది. ఇప్పటికే కూటమి పేరుతో చంద్రబాబు 2014లో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, ఆ మోసాలను ప్రజలు మరిచిపోవద్దని చెబుతున్నారు జగన్‌.

ఒంగోలు నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు కొండపి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదిమూలపు సురేష్‌ని గెలిపించాలని ఓటర్లను కోరనున్నారు జగన్‌. టంగుటూరులో పర్యటన తర్వాత మధ్యాహ్నం 12.30కి కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గంలో పర్యటిస్తారు సీఎం జగన్‌. మైదుకూరు 4 రోడ్ల జంక్షన్‌లో జరిగే సభలో పాల్గొంటారు ముఖ్యమంత్రి. కడప నుంచి ఎంపీ అభ్యర్ధిగా అవినాష్‌రెడ్డి, మైదుకూరు అసెంబ్లీ స్థానం నుంచి రఘురామిరెడ్డి పోటీ చేస్తున్నారు.

కడప పార్లమెంట్‌ నియోజకవర్గంలో ప్రచారం తర్వాత మధ్యాహ్నం రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గంలో పర్యటిస్తారు సీఎం జగన్‌. మధ్యాహ్నం 3 గంటలకు పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. 175 అసెంబ్లీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు సీఎం జగన్‌. కాగా, రాజంపేట ఎంపీ అభ్యర్థిగా మిథున్‌రెడ్డి, పీలేరు అభ్యర్థిగా చింతల రాంచంద్రారెడ్డి పోటీ చేస్తున్నారు. చంద్రబాబుతో పాటు కూటమి నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడుతూ, మండే ఎండలో తన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు సీఎం జగన్.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Latest Articles
వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే వారికి మంచి ఆప్షన్‌ ఇవే..
వెయిట్‌ లాస్‌ అవ్వాలనుకునే వారికి మంచి ఆప్షన్‌ ఇవే..
అయ్యో అక్కయ్యా.. ఎంతకష్టం వచ్చింది నీకు.! వీడియో వైరల్..
అయ్యో అక్కయ్యా.. ఎంతకష్టం వచ్చింది నీకు.! వీడియో వైరల్..
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
ఐష్‌ డెడికేషన్‌కు అభిమానులు ఫిదా.. చేతి కట్టుతోనే ర్యాంప్‌ వాక్‌.
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
అమెరికాలో బైడెన్‌ ప్రభుత్వం సంచలన నిర్ణయం.! గంజాయి బ్యాచ్‌లకు ఊరట
పెరుగుతో కాన్సర్‌కు చెక్‌.. 14 లక్షలమందిపై పరిశోధనలు.
పెరుగుతో కాన్సర్‌కు చెక్‌.. 14 లక్షలమందిపై పరిశోధనలు.
పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..
పురుషుల సంతానలేమికి తల్లే కారణమా.? CCMB అధ్యయనం..
భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..
భారత్‌కు పాఠాలు చెప్పొద్దు.! దేశీస్‌ డిసైడ్‌ సదస్సులో వ్యాఖ్యలు..
టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!
టిష్యూ పేపర్‌ కలకలం.. విమానం నుంచి దిగిపోయిన ప్రయాణీకులు.!
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
ప్రభాస్‌ లైఫ్‌లోకి ప్రత్యేకమైన వ్యక్తా ?? టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ
ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?
ఆడుకుంటూ ఆడుకుంటూ కుప్పకూలిన చిన్నారి.. ఆ డాక్టర్‌ ఏం చేసిందంటే ?