కింగ్ కోబ్రా పిల్లకు కూడా ఇంత పవరుంటుందా..? మన్యం జిల్లాలో ఏం జరిగిందంటే..?

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలంలోని ఊసకొండ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇంట్లోకి చొరబడిన కింగ్ కోబ్రా కాటుకు ఆరిక బాబురావు అనే యువకుడు మృతి చెందాడు. సాధారణంగా కింగ్ కోబ్రాలు మనుషులపై దాడి చేయవని, తమకు ముప్పు ఉందని భావించినప్పుడే రక్షణాత్మకంగా స్పందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

కింగ్ కోబ్రా పిల్లకు కూడా ఇంత పవరుంటుందా..? మన్యం జిల్లాలో ఏం జరిగిందంటే..?
Baburao

Edited By:

Updated on: Jun 06, 2026 | 10:45 AM

పార్వతీపురం మన్యం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. కురుపాం మండలంలోని ఊసకొండ గ్రామంలో అర్ధరాత్రి ఓ భారీ కింగ్ కోబ్రా ఇంట్లోకి ప్రవేశించి యువకుడిని కాటేయడంతో అతడు మృతిచెందాడు. గ్రామానికి చెందిన ఆరిక బాబురావు ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా కింగ్ కోబ్రా ఇంట్లోకి చొరబడింది. మొదట సాధారణ పాముగా భావించిన కుటుంబ సభ్యులు అప్రమత్తమయ్యేలోపే అది బాబురావుపై దాడి చేసినట్లు స్థానికులు తెలిపారు. పాము కాటు వేయడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, విషం శరీరంలో వేగంగా వ్యాపించడంతో పరిస్థితి విషమించి ఆయన మృతి చెందినట్లు సమాచారం. ఘటనతో ఊసకొండ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

అటవీ ప్రాంతాలకు సమీపంలోని గ్రామాల్లో ఇటీవల పాముల సంచారం పెరుగుతుండటంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కింగ్ కోబ్రా వంటి అత్యంత విషపూరితమైన పాము గ్రామంలో కనిపించడం ప్రజల్లో భయాందోళనలకు కారణమైంది. రాత్రి వేళల్లో బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెబుతున్నారు.

అయితే, నిపుణుల ప్రకారం కింగ్ కోబ్రా సాధారణంగా మనుషులపై కారణం లేకుండా దాడి చేయదు. తనకు ప్రమాదం పొంచి ఉందని భావించినప్పుడు లేదా ఎవరైనా దగ్గరకు వెళ్లి ఇబ్బంది పెట్టినప్పుడు మాత్రమే రక్షణాత్మకంగా స్పందిస్తుంది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన విషపూరిత పాముగా గుర్తింపు పొందిన కింగ్ కోబ్రా, బెదిరింపు అనిపించినప్పుడు పడగ విప్పి హెచ్చరికలు జారీ చేస్తుంది. అయినప్పటికీ, దాని విషం అత్యంత ప్రమాదకరమైనదిగా పరిగణించబడుతుంది.

ఈ ఘటన నేపథ్యంలో గ్రామస్తులు అటవీ శాఖ అధికారులు వెంటనే స్పందించి గ్రామ పరిసరాల్లో పాముల సంచారాన్ని నియంత్రించే చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. అలాగే పాములు కనిపించినప్పుడు ఎలా స్పందించాలి, అత్యవసర పరిస్థితుల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us