Andhra News: అమ్మమ్మ అంత్యక్రియలకని వచ్చాడు.. కట్‌చేస్తే.. శ్మాశానంలోనే..

కాకినాడ జిల్లా యూ కొత్తపల్లి మండలం మూలపేట గ్రామ శ్మశాన వాటికలో ఒక దారుణ సంఘటన వెలుగుచూసింది. అమ్మమ్మ అంత్యక్రియల కోసం గ్రామానికి వచ్చిన యువకుడిపై కొందరు వ్యక్తులు కత్తులతో దాడి చేయడంతో.. తీవ్రంగా గాయపడిన యువకుడు హాస్పిటల్‌లో వెళ్లేలోపే ప్రాణాలు కోల్పోయాడు. బాధితుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Andhra News: అమ్మమ్మ అంత్యక్రియలకని వచ్చాడు.. కట్‌చేస్తే.. శ్మాశానంలోనే..
Kakinada District Murder

Updated on: Jul 16, 2026 | 12:01 PM

అమ్మమ్మ అంత్యక్రియలకు అని వచ్చిన ఓ యువకుడు.. ఆమెకు అంత్యక్రియలు జరుగుతున్న స్థలంలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన కాకినాడ జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. పెదపూడి మండలం ఏపీత్రయం గ్రామానికి చెందిన కాదా రాకేష్ అనే యువకుడు తన అమ్మమ్మ వేమగిరి రమణమ్మ చనిపోవడంతో.. ఆమె అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఫ్యామిలీతో పాటు మూలపేట గ్రామానికి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామంలోని ఒక షాప్ వద్దకు రాకేష్ తన చెల్లితో వెళ్లగా, అక్కడ అతని చెల్లితో కొందరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు.

దీంతో ఆగ్రహానికి గురైన రాకేష్ వారితో వివాధానికి దిగాడు.. దీంతో వివాదం కాస్త పెద్దగా మారడంతో అతని చెల్లి పోలీసులకు 112కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసింది. దీంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, గ్రామంలోని పెద్దలతో కలిసి సమస్యను సద్దుమనిగించారు. దీంతో ఎక్కడివాళ్లు అక్కడికి వెళ్లిపోయారు.

అయితే, ఈ గొడవ ఇంతటిలో ముగియలేదు.. స్మశాన వాటికలో అమ్మమ్మ అంత్యక్రియలు జరుగుతుండగా ఇరువర్గాల మధ్య మళ్లీ వివాదం మొదలైంది. ఇది కాస్తా తీవ్ర కొట్లాటకు దారి తీసింది. ఈ ఘర్షణలో ప్రత్యర్థులు రాకేష్‌పై కత్తితో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన రాకేష్‌ను హాస్పిటల్‌కు తరలించేలోపే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో బాధితుడి కుటుంబం ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us