AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..

సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బాలికని గండికోట తీసుకెళ్లిన ప్రియుడు లోకేష్‌... 10 గంటల 40 నిమిషాలకి ఒక్కడే వెనక్కి వెళ్లిపోయాడు. బాలిక కాలేజ్‌కి వెళ్లలేదనే విషయం ఇంట్లో తెలిసిందని భయపడి... తనను అక్కడే వదిలేసి లోకేష్‌ వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత గండికోటకు బాలిక బంధువు సురేంద్ర వెళ్లినట్టు గుర్తించారు.

Andhra: వైష్ణవిని ప్రియుడు చంపలేదు.. ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు..
Crime News
Shaik Madar Saheb
|

Updated on: Jul 16, 2025 | 4:59 PM

Share

ప్రియుడు చంపలేదు..! ఆత్మహత్యా జరగలేదు..! మరి మైనర్‌ బాలిక ఎలా చనిపోయింది..? పరువు హత్య ఏమైనా జరిగి ఉంటుందా..? అసలేం జరిగింది.. ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఇంటర్ విద్యార్థి వైష్ణవి హత్య మిస్టరీగా మారింది. బాలికను ప్రియుడు లోకేష్‌ హత్య చేశాడని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తుండగా.. అసలు, మైనర్ బాలిక హత్య కేసులో ప్రియుడు లోకేష్ ప్రమేయం లేదని పోలీసులు పేర్కొనడం సంచలనంగా మారింది. అంతేకాకుండా ఆమెపై లైంగిక దాడి కూడా జరగలేదని వెల్లడించారు. గండికోటను పరిశీలించిన ఎస్పీ, డీఐజీ కీలక ఆధారాలు సేకరించారు. అన్ని కోణాల్లో దర్యప్తు ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు.

సోమవారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు బాలికని గండికోట తీసుకెళ్లిన ప్రియుడు లోకేష్‌… 10 గంటల 40 నిమిషాలకి ఒక్కడే వెనక్కి వెళ్లిపోయాడు. బాలిక కాలేజ్‌కి వెళ్లలేదనే విషయం ఇంట్లో తెలిసిందని భయపడి… తనను అక్కడే వదిలేసి లోకేష్‌ వెళ్లిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత గండికోటకు బాలిక అన్న సురేంద్ర వెళ్లినట్టు గుర్తించారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది.

బుధవారం స్పాట్‌కి ఎస్పీతో పాటు వెళ్లిన డీఐజీ ప్రవీణ్ పలు కీలక ఆధారాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశామని తెలిపారు. అయితే బాలికపై ఎలాంటి లైంగిక దాడి జరగలేదని తెలిపారు. బాలిక శరీరంపై దుస్తులు లేకుండా పడి ఉండడం వల్ల అఘాయిత్యం జరిగిందని అందరూ భావించారని, అయితే అలాంటిది ఏమీ జరగలేదన్నారు. నిందితుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డీఐజీ ప్రవీణ్ పేర్కొన్నారు

హత్య ఎలా జరిగిందన్న విషయాన్ని వీలైనంత త్వరగా చేధిస్తామని.. స్పెషల్‌ టీమ్‌తో పాటు డాగ్ స్వాడ్‌ను రంగంలోకి దింపినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాదు… వైష్ణవి హత్య కేసులో కుటుంబ సభ్యులను సైతం విచారించనున్నారు పోలీసులు.

ఎన్నో ట్విస్టులతో హత్యా…? లేదా పరువు హత్యా…? ఇంకా మిస్టరీగానే గండికోట బాలిక హత్య కేసు కొనసాగుతోంది. బాలికను చంపింది ఎవరనేదానిపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి గండికోటలో సీసీ ఫుటేజ్‌లను పోలీసులు పరిశీలిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ధూమపానం నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటారు?
ధూమపానం నిజంగానే ఒత్తిడిని తగ్గిస్తుందా? నిపుణులు ఏమంటారు?
చట్నీ చేసిన గంటకే పాడైపోతుందా?.. ఈ టిప్స్ తో చేస్తే అదిరే టేస్ట్
చట్నీ చేసిన గంటకే పాడైపోతుందా?.. ఈ టిప్స్ తో చేస్తే అదిరే టేస్ట్
తక్కువ ధరకే ఇంటర్నెట్.. గ్రామీణ ప్రజలకు శుభవార్త
తక్కువ ధరకే ఇంటర్నెట్.. గ్రామీణ ప్రజలకు శుభవార్త
అహ్మదాబాద్‌లో మిల్లర్ విధ్వంసం.. రికార్డులతో రెచ్చిపోయిన బుమ్రా
అహ్మదాబాద్‌లో మిల్లర్ విధ్వంసం.. రికార్డులతో రెచ్చిపోయిన బుమ్రా
రిటైర్మెంట్ తర్వాత ఈ మార్పులు చేసుకోకుంటే జీవితం నరకమే!
రిటైర్మెంట్ తర్వాత ఈ మార్పులు చేసుకోకుంటే జీవితం నరకమే!
లెదర్ వర్సెస్ ఫాబ్రిక్: ఏ సోఫా మీ ఇంటికి బెస్ట్?..
లెదర్ వర్సెస్ ఫాబ్రిక్: ఏ సోఫా మీ ఇంటికి బెస్ట్?..
ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. వీరికి రూ.2 లక్షలు
ఏపీ ప్రభుత్వం భారీ శుభవార్త.. వీరికి రూ.2 లక్షలు
ఈ బ్యూటీ ఇంతగా మారిపోయిందేంటీ.. కుర్ర హీరోయిన్లే కుళ్లుకునేలా..
ఈ బ్యూటీ ఇంతగా మారిపోయిందేంటీ.. కుర్ర హీరోయిన్లే కుళ్లుకునేలా..
తిన్న ప్లేట్లు కడిగేస్తున్నారా?.. అయితే మీరు మామూలు వ్యక్తి కాదు
తిన్న ప్లేట్లు కడిగేస్తున్నారా?.. అయితే మీరు మామూలు వ్యక్తి కాదు
ఆ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. క్షణాల్లో జలమయంగా మారిన రోడ్లు
ఆ జిల్లాలో దంచికొట్టిన వర్షం.. క్షణాల్లో జలమయంగా మారిన రోడ్లు