AP Inter Exams: ఏపీలో ఇంటర్, ప్రవేశ పరీక్షల నిర్వహణ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..

|

May 24, 2021 | 8:59 AM

AP Inter Exams: రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఇంటర్, ఇతర ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని...

AP Inter Exams: ఏపీలో ఇంటర్, ప్రవేశ పరీక్షల నిర్వహణ అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన మంత్రి..
Follow us on

AP Inter Exams: రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గిన తర్వాత ఇంటర్, ఇతర ప్రవేశ పరీక్షలను నిర్వహించేందుకు సిద్దంగా ఉన్నామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. విద్యార్ధుల భవిష్యత్తు దృష్ట్యా ఇంటర్ పరీక్షలను నిర్వహించాలని భావిస్తున్నామని చెప్పిన ఆయన.. గతేడాది కూడా కోవిడ్ నిబంధనలను పాటిస్తూనే ఎగ్జామ్స్ పూర్తి చేశామని అన్నారు.

కేంద్రమంత్రి రాజ్‌నాధ్ సింగ్ అధ్యక్షతన వివిధ రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇంటర్ పరీక్షల నిర్వహించే కేంద్రాల్లో శానిటైజ్ చేసి.. ప్రతీ చోటా ఐసోలేషన్ కేంద్రం ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ సందర్భంగా వారికి చెప్పారు.

Also Read:

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌.. గాల్లో పల్టీలు కొట్టిన కారు.. షాకింగ్ దృశ్యాలు..

గగుర్పొడిచే దృశ్యం.. పామును సజీవంగా మింగేస్తోన్న మరో పాము.. వీడియో వైరల్.!

SBI కస్టమర్లకు అలర్ట్.. మీ అకౌంట్ నుంచి రూ.147 డెబిట్ అవుతున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంక్.!