AP News: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం

ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 25 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ , ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ (NCAP), యానాం..

AP News: ఏపీ ప్రజలకు అలెర్ట్.. ఈ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం
AP Weather Report

Edited By:

Updated on: Apr 21, 2024 | 5:51 PM

ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 25 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ , ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ (NCAP), యానాం, రాయలసీమలోని పలు ప్రదేశాలలో ఉరుములతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. గంటకు 30 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వర్షం పడని చోట వేడి, తేమ, అసౌకర్యవంతమైన వేసవి వాతావరణం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని పేర్కొంది.

 

ఏపీలో ఎండలకు బ్రేక్ పడింది. చాలా ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. ఉక్కపోత నుంచి జనం రిలీఫ్ పొందుతున్నారు. అయితే పిడుగుల అలెర్ట్ జారీ చేసింది ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ. మధ్యాహ్నం నుంచి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అక్కడక్కడా పిడుగులతో కూడి వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.  ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.  పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదన్నారు. సురక్షితమైనభవనాల్లో ఆశ్రయం పొందాలని సూచించారు. ఇటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా పలు ఫోన్లకు హెచ్చరిక మెసేజీలు వచ్చాయి. పిడుగులు పడే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని అందులో సూచించారు.

ఇవి కూడా చదవండి

ఎండలు కొనసాగే అవకాశం…

APలో ఎండలు దంచికొడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. పగటిపూట బయటకు రావాలంటేనే భయపడుతున్నారు జనం. 45మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 197మండలాల్లో వడగాల్పులు ఉన్నాయని.. వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. మరో ఇరవై రోజుల పాటు.. ఇదే పరిస్థితులుంటాయని అధికారులు చెబుతున్నారు.

కాగా ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 25 వరకు ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ , ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రదేశ్ (NCAP), యానాం, రాయలసీమలోని పలు ప్రదేశాలలో ఉరుములతో కూడిన ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని కూడా అంచనా వేసింది. గంటకు 30 నుంచి 50 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. వర్షం పడని చోట వేడి, తేమ, అసౌకర్యవంతమైన వేసవి వాతావరణం కూడా రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని పేర్కొంది.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Loading...
Unable to load recommendations.
Follow Us