ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) గురించి తెలంగాణ మంత్రి కేటిఆర్ చేసిన వ్యాఖ్యలు వాస్తవరూపంగా ఉన్నాయని మాజీ మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డి(DL.Ravindra Reddy) అన్నారు. రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు బాధాకరమన్న ఆయన.. త్వరలో రాష్ట్రంలో ఆర్థిక ఎమర్జెన్సీ రానుందని జోస్యం చెప్పారు. ఉద్యాన వర్శిటీలో ఉద్యోగాల పేరుతో సీఎం బంధువునంటూ సురేంద్రనాధ్ రెడ్డి రూ.5 కోట్లు వసూలు చేసి, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. వివేకా హత్య కేసులో సీబీఐకి సునీత ఇచ్చిన జాబితాలో సురేంద్రనాధ్ రెడ్డి ముద్దాయిగా ఉన్నారని.. ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆక్షేపించారు. కడప జిల్లాలోని వేముల మండలంలో అక్రమ మైనింగ్ జరుగుతోందన్న రవీంద్రారెడ్డి.. అక్రమ మైనింగ్ కు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నారని అన్నారు. వెంటనే మైనింగ్ శాఖ అధికారులు తనిఖీలు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పక్క రాష్ట్రంలో కరెంటు, నీళ్లు లేవని.. రోడ్లన్నీ ధ్వంసమయ్యాయంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెంటనే స్పందించారు. హైదరాబాద్లోనూ కరెంటు కోతలున్నాయని, తాను జనరేటర్ వేసుకుని ఉన్నానని అన్నారు. కరెంటు కోతలు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వివరించారు. బొత్స మాటలపై తెలంగాణలో కొందరు నేతలు స్పందించారు. ఏపీలో ఉన్నదే కేటీఆర్ చెప్పారని స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
ఇవీచదవండి.
Taj Mahal Controversy: కొత్త వివాదంలో తాజ్ మహల్.. మరోసారి తెరపైకి తేజో మహాలయ శివుడి ప్రతిష్ట!
Viral Video: బాలుడు సైకిల్ మీద స్టంట్స్.. హఠాత్తుగా ముందు చక్రం ఊడడంతో ఊహించని పరిణామం..