Andhra Pradesh: అద్భుతం.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని ఫస్ట్ టైమ్.. ఒకేసారి సముద్రంలో కలుస్తోన్న 5 నదులు..

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీలో ఫస్ట్‌టైమ్‌.. ఒకేసారి ఐదు నదులు సముద్రంలో కలుస్తున్నాయి. అవును, ఐదు నదులూ ఒకేసారి సముద్రంలో కలుస్తున్నాయి.

Andhra Pradesh: అద్భుతం.. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోని ఫస్ట్ టైమ్.. ఒకేసారి సముద్రంలో కలుస్తోన్న 5 నదులు..
Sea

Updated on: Sep 12, 2022 | 6:06 AM

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీలో ఫస్ట్‌టైమ్‌.. ఒకేసారి ఐదు నదులు సముద్రంలో కలుస్తున్నాయి. అవును, ఐదు నదులూ ఒకేసారి సముద్రంలో కలుస్తున్నాయి. రాష్ట్రంలో ప్రవహించే కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదులు ఎట్‌-ఏ-టైమ్‌ కడలి వైపు పరుగులు తీస్తున్నాయి. ఈ ఐదు నదుల పరివాహక ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండి, మిగులు జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. రాష్ట్రంలో ప్రవహించే ఈ ఐదు నదులూ ఒకేసారి సముద్రంలో కలుస్తుండటం ఏపీ హిస్టరీలో ఇదే ఫస్ట్‌టైమ్‌ అంటున్నారు ఇరిగేషన్‌ ఎక్స్‌పర్ట్స్‌.

కొద్దిరోజులుగా కురుస్తోన్న వర్షాలతో కృష్ణా, గోదావరి, పెన్నా, వంశధార, నాగావళి నదులకు వరద నీరు పోటెత్తుతోంది. ఒకవైపు స్టేట్‌లో కురుస్తోన్న వర్షాలు, మరోవైపు ఎగువన నుంచి వస్తోన్న వరదతో నదులన్నీ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దాంతో, ప్రాజెక్టులన్నీ నిండిపోయి నిండుకుండలను తలపిస్తున్నాయ్‌. దాంతో, మిగులు జలాలను సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి సుమారు నాలుగున్నర లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సుమారు మూడున్నర లక్షల క్యూసెక్కుల గోదావరి వాటర్ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. అలాగే, గొట్టా బ్యారేజ్‌ నుంచి వంశధార నదీజలాలు, నెల్లూరు బ్యారేజ్ నుంచి పెన్నా వాటర్‌, నారాయణపురం ఆనకట్ట నుంచి నాగావళి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయ్.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us