CM Jagan: చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. నంద్యాల బహిరంగ సభలో ఏమన్నారంటే!

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో ఎన్నిక ప్రచారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేపట్టిన బస్సుయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. రెండురోజు సాగిన బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సెల్ఫీలు దిగుతూ, అప్యాయంగా పలుకరిస్తూ బస్సు యాత్ర సాగింది.

CM Jagan: చంద్రబాబుపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు.. నంద్యాల బహిరంగ సభలో ఏమన్నారంటే!
Cm Ys Jagan

Updated on: Mar 28, 2024 | 7:35 PM

ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం పేరుతో ఎన్నిక ప్రచారంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేపట్టిన బస్సుయాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. రెండురోజు సాగిన బస్సు యాత్రకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సెల్ఫీలు దిగుతూ, అప్యాయంగా పలుకరిస్తూ బస్సు యాత్ర సాగింది. ఇవాళ నంద్యాలలో ఏర్పాటుచేసిన భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రజలనుద్దేశించి మాట్లాడారు.

జనసంద్రంలా వచ్చిన సైన్యం సిద్ధం అంటోందని, ఈ ఎన్నికల్లో నరకాసురుడు, రావణుడు, దుర్యోధనుడు ఒకేసారి కలిసి వచ్చారని, మళ్లీ నారా పాలన తెస్తామంటున్నారు సీఎం జగన్ కూటమిని ఉద్దేశించి మండిపడ్డారు. సంక్షేమ రాజ్యాన్ని కూల్చడానికి 3 పార్టీలు ఒక్కటయ్యాయని, ఇటు జగన్ ఒక్కడు.. అటు చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్, మరోవైపు BJP కూడా జతకట్టిందని జగన్ అన్నారు.

ఇక వీరికి కాంగ్రెస్ పార్టీ కూడా తోడైంది సీఎం అన్నారు. పేదలను మళ్లీ చీకట్లోకి తీసుకెళ్లేందుకే పొత్తులు ఏర్పడ్డాయని, కుట్రలను ఎదుర్కొనేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని, ఈ ఎన్నికల్లో సీఎం డబుల్ సెంచరీ కొడుదాం సీఎం జగన్ అన్నారు. వైసీపీకి ఓటేస్తే మరో ఐదేళ్లు ముందుకు వెళ్తామని, చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి వెళ్తామని జగన్ అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు కావాలని సీఎం జగన్‌ ఈ సందర్బంగా టీడీపీపై విరుచుకుపడ్డారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us