Andhra Pradesh: ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్.. తక్కువ ధరకే సబ్సీడీపై టామాటా..

కూరగాయల ధరలు మండిపోతున్నాయి. ముఖ్యంగా టమాటా అయితే సామాన్యులకు చిక్కను అంటోంది. దీంతో ప్రజలు ఇబ్బందులు అర్థం చేసకున్న జగన్ సర్కార్ అధిక ధరలు నుంచి ఉపశమనం కలిగించేందుకు రెడీ అయ్యింది. ఆ డీటేల్స్ మీ కోసం...

Andhra Pradesh: ఏపీ ప్రజలకు సర్కార్ గుడ్ న్యూస్.. తక్కువ ధరకే సబ్సీడీపై టామాటా..
Tomato

Updated on: Jun 29, 2023 | 3:51 PM

పండు చాలా ఎర్రగా ఉంటుంది..అది వేస్తే వంట కమ్మగా ఉంటుంది. అది లేకపోతే..ఏదో వెలితి..పోనీ వేద్దామంటే..అందని ద్రాక్షతో పోటీ పడుతోంది..అది లేకుండా కూర కాదు కదా.. చారు కూడా చేయలేం..కూరల్లో దాని డిమాండ్‌ అటువంటిది..అదేమో..ఇప్పుడు కొండలపై రేటు రేస్‌ పెట్టినట్లు ఎగబాకుతూనే ఉంది. ఎంత బతిమాలినా దిగి రావట్లేదు..బుజ్జగించినా..మాట వినట్లేదు. పైగా మొండికేస్తోంది..రోజురోజుకూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తోంది.. ఇంతకీ ఎవరో తెలుసా.. బుజ్జిబుజ్జిగా ఉండే ఎర్రని టమాటా..

అవునండీ.. ఈ మధ్య టమాటా ఎక్కడలేని బిల్డప్పు ఇస్తోంది..దానికే కొమ్ములొచ్చినట్లు తెగ బడాయి పడుతోంది.. వంద కొడితే కానీ..ఇంటికి రానని బెట్టు చేస్తోంది..రైతు మార్కెట్‌లోనే వంద కొట్టాలంటోంది..బయటైతే అస్సలు నా గురించి తలుచుకోకండి..నేనున్నానని మరిచిపోండి కరాఖండీగా చెబుతోంది..ఈ డిమాండ్‌ తట్టుకోలేక..ఏపీ గవర్నమెంట్‌.. రైతు బజార్లలో సబ్సిడీ టమాటా ఇవ్వాలని నిర్ణయించింది.  టమాటాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి  రైతుబజార్లలో కేజీ రూ.50కే అందుబాటులో ఉంచుతోంది. చూశారా..టమాటా దెబ్బకు..ప్రభుత్వమే దిగొచ్చింది.. టమాటానా మజాకానా..

టమాటా ఒక్కటే కాదండోయ్‌.. పచ్చిమిచ్చి..అల్లం, ఇతర కూరగాయలు కూడా ఎప్పుడో ఎవరెస్ట్‌ ఎక్కేశాయి.. ఎక్కినవి గమ్మున ఉండకుండా..టమాటాను కూడా వెక్కిరిస్తున్నాయట..అందుకే టమాటా కూడా నాదీ మీ బాటే అంటూ..ఎగబాబుతూనే ఉంది.. ప్రభుత్వం పుణ్యమా అని సబ్సిడీతో దొరుకుతోంది లేదంటే ఇంకేమైనా ఉందా.. దే..వు..డా…

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..