APPSC Group 1 Mains Analysis: తొలి రోజు తెలుగు పేపర్‌.. ప్రశ్నల సరళి ఎలా ఉందంటే..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 3 నుంచి ఎపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ నెల10వ తేదీ వరకు పరీక్షలు..

APPSC Group 1 Mains Analysis: తొలి రోజు తెలుగు పేపర్‌.. ప్రశ్నల సరళి ఎలా ఉందంటే..?
APPSC Group 1 Mains

Updated on: Jun 04, 2023 | 12:57 PM

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రవ్యాప్తంగా జూన్‌ 3 నుంచి ఎపీపీఎస్సీ గ్రూప్‌ 1 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఉదయం 10.00 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పరీక్షలు జరుగుతాయి. ఈ నెల10వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. దాదాపు పది జిల్లాల్లో 11 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు డిస్క్రిప్టివ్‌ టైప్‌ (పెన్ను, పేపర్‌ విధానంలో) జరుగుతున్నాయి. దాదాపు 6,455 మంది గ్రూప్- 1 మెయిన్స్‌కు హాజరవుతున్నారు.

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ తొలి రోజున తెలుగు పేపర్‌ (క్వాలిఫైయింగ్‌ పేపర్) నిర్వహించారు. మొత్తం 150 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రం కొంత సులువుగా వచ్చనట్లు విశ్లేషకులు, అభ్యర్ధులు పేర్కొన్నారు. నూతన విద్యావిధానం 2020, ఉగ్రవాదం, ప్రపంచ శాంతి, ఏపీ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం, 21వ శతాబ్దంలో సాంస్కృతిక పరివర్తన, సమాజంపై సోషల్‌ మీడియా ప్రభావం వంటి అంశాలపై ప్రశ్నలు అడిగారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్‌ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us