
తీవ్రమైన చలితో తెలుగు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. తెలంగాణలో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. తెలంగాణలో గత పదేళ్ల రికార్డులను బద్దలు కొడుతూ చలి తీవ్రత కొనసాగుతోంది. అటు ఆంధ్రప్రదేశ్లో కూడా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి.. ముఖ్యంగా.. గత 2 రోజులుగా ఉత్తరాది నుంచి వీస్తున్న శీతల గాలుల వల్ల.. ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయని.. దీంతో ఈ పరిస్థితి నెలకొందని వాతావరణ శాఖ చెబుతోంది. రాబోయే రోజుల్లో అతిశీతల గాలులతోపాటు పొగమంచు పెరిగే అవకాశం ఉందంటూ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ క్రమంలోనే.. వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ లో వచ్చే మూడు రోజుల వాతావరణ పరిస్థితులపై కీలక ప్రకటన చేసింది. చలి తీవ్రత పెరగడంతోపాటు.. పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో ఈశాన్య – తూర్పు దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు ఈ కింది విధంగా ఉన్నాయి..
మంగళవారం, బుధవారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణము కంటే 2-4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది.
గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉంది.
మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశము ఉంది.
కనిష్ట ఉష్ణోగ్రతలు ఒకటి లేదా రెండు చోట్ల సాధారణము కంటే 2-4 డిగ్రీల సెంటీగ్రేడ్ తక్కువగా నమోదయ్యే అవకాశముంది.
గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశము ఉందని.. అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..