AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP: ఇకపై ఆ ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. విద్యాసంస్థలకు ఏపీ సర్కార్ సీరియస్ వార్నింగ్

అటు విద్యార్థులకు, ఇటు పేరెంట్స్‌కు గుడ్ న్యూస్. ఇకపై టీవీల్లో, పత్రికల్లో టెన్త్ క్లాస్ ర్యాంక్స్ గురించి ప్రకటనల కన్‌ఫ్యూజన్ ఉండదు. ఈమేరకు ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

AP: ఇకపై ఆ ప్రచారం చేస్తే కఠిన చర్యలు.. విద్యాసంస్థలకు ఏపీ సర్కార్ సీరియస్ వార్నింగ్
Ap Cm Ys Jagan
Ram Naramaneni
|

Updated on: Jun 02, 2022 | 8:49 AM

Share

Tenth ranks: ‘మాదే ఫస్ట్ ర్యాంక్’… ‘కాదు.. కాదు మాదే ఫస్ట్ ర్యాంక్’.. ‘టాప్ 10 ర్యాంకుల్లో 8 మావే’… ‘టాప్ 10లో 9 మా విద్యార్థులవే’.. అంటూ  పేపర్లలో, టీవీల్లో విద్యాసంస్థలు ఊదరగొడుతూ ఉంటాయి. అసలు వీటిలో ఎంత నిజముందో ఎవరికీ తెలీదు. అటు విద్యార్థులు, ఇటు పేరెంట్స్ ఈ ర్యాంకుల మాయాజాలం అర్థం కాక గందరగోళానికి గురవుతారు. అయితే ఇకపై ఈ న్యూసెన్స్ ఉండదు. ఈ ప్రకటనల పందేరానికి అడ్డుకట్ట వేస్తూ ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. టెన్త్ క్లాస్ పబ్లిక్‌ పరీక్షల్లో విద్యార్థులకు ర్యాంకులు వచ్చినట్లు ఏ విధంగానూ ప్రచారం చేయకూడదని.. విద్యా సంస్థలను ఆదేశిస్తూ జగన్ ప్రభుత్వం(Jagan Government) ఉత్తర్వులు జారీ చేసింది.  ర్యాంకుల పేరుతో జరిగే ప్రచారం వాస్తవాలను కప్పిపెట్టేలా ఉంటోందంటూ విద్యార్థులు, పేరెంట్స్ నుంచి అందిన విజ్ఞప్తుల మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ ఉత్తర్వులను లైట్ తీసుకోవాడానికి వీల్లేదు. ఎందుకంటే  తప్పుడు ప్రచారం చేసినట్లు తేలితే సంబంధితులకు మూడేళ్లకు తగ్గకుండా ఏడేళ్ల వరకు జైలుశిక్షను విధించే అవకాశం ఉందని అధికారులు వార్నింగ్ ఇచ్చారు. అలాగే రూ.లక్ష వరకు ఫైన్ విధించే అధికారం కూడా ఉందని వెల్లడించారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని విద్యాసంస్థలను నడుచుకోవాలని సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి