Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.6 వేలు.. చెక్ చేస్కోండి

ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బుల విడుదలపై క్లారిటీ ఇచ్చింది. శుక్రవారం గన్నవరంలో జరిగే సభలో సీఎం చంద్రబాబు ఆ స్కీమ్ డబ్బలును విడుదల చేయున్నారు. ఈ మేరకు ప్రభుత్వం షెడ్యల్ ఖరారు చేసింది. అలాగే పీఎం కిసాన్ డబ్బులు కూడా 13వ తేదీన విడుదల కానున్నాయి.

Andhra Pradesh: ఏపీ రైతులకు భారీ గుడ్ న్యూస్.. రేపే అకౌంట్లోకి రూ.6 వేలు.. చెక్ చేస్కోండి
Annadata Sukhibhava

Updated on: Mar 12, 2026 | 5:50 PM

ఏపీలోని రైతులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అందించింది. అన్నదాత సుఖీభవ డబ్బుల కోసం రైతులు కొన్ని నెలలుగా ఎదురుచూస్తుండగా.. ఎప్పుడు విడుదల చేస్తామనే విషయంపై గురువారం ప్రభుత్వం అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు స్వయంగా నిధుల విడుదల తేదీని ప్రకటించారు. ఈ నెల 13వ తేదీన(శుక్రవారం) అన్నదాత సుఖీభవ డబ్బలును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. బుధవారం నుంచి అమరావతిలోని సెక్రటేరియట్‌లో చంద్రబాబు కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా గురువారం చంద్రబాబు మాట్లాడుతూ.. శుక్రవారం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద సాయం విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీని వల్ల రాష్ట్రంలోని లక్షలాది రైతులకు లబ్ది చేకూరనుందన్నారు.

అకౌంట్లోకి రూ.6 వేలు

అన్నదాత సుఖీభవ పథకం కింద ఏపీ ప్రభుత్వం రైతుల అకౌంట్లో రూ.4 వేలు వేయనుంది. ఇక పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు విడుదల చేయనుంది. దీంతో రేపు ఏపీ రైతులకు రూ.6 వేలు చొప్పున అందనుంది. మొత్తం ఏపీలో 46.80 లక్షల మంది ఖాతాల్లో రూ.2,808 కోట్లు జమ కానున్నాయి. గన్నవరంలో జరిగే సభలో చంద్రబాబు అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నారు. ప్రధాని మోదీ శుక్రవారం గౌహతిలో జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ పథకంతో కలిసి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తోన్న విషయం తెలిసిందే. దీంతో కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసే రోజునే వాటితో కలిపి అన్నదాత సుఖీభవ డబ్బులను అందిస్తోంది. కేంద్రం 13వ తేదీన పీఎం కిసాన్ డబ్బులు వేయనుడటంతో.. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే రోజున విడుదల చేస్తోంది.

త్వరలో సంక్షేమ పథకాల క్యాలెండర్

ఇక త్వరలో సంక్షేమ పథకాల క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు కలెక్టర్ల సమావేశంలో చంద్రబాబు ప్రకటించారు. ప్రజలకు ఈ క్యాలెండర్‌ను అందిస్తామని, వాటిల్లో ఏ నెలలో ఏ పథకాలు అమలు చేస్తామనే వివరాలు ఉంటాయన్నారు. దీని వల్ల పథకాలు ఎప్పుడు వస్తాయనే ఆందోళన ప్రజలకు ఉండదన్నారు. 13వ తేదీన మూడో విడతగా రైతులకు రూ.6 వేలు అకౌంట్లలో వేయనున్నామని, అలాగే ఉగాదికి కొత్త ఇళ్లను కేటాయిస్తామని అన్నారు. అర్హులైనవారందరికీ ఇంటి స్థలంతో పాటు ఇళ్లను కేటాయిస్తామని స్పష్టం చేశారు. ప్రతీ ఇంటికి ఇంటర్నెట్ కనెక్షన్‌తో పాటు జల జీవన్ మిషన్ ద్వారా ప్రతీ ఇంటిక మంచినీటి కుళాయి కనెక్షన్ ఇస్తామని ప్రకటించారు. ఇక పీ4 కార్యాక్రమాన్ని డ్వాక్రా,. మోప్మా సంఘాల సహకారంతో సమర్థవంతంగా చేపడతామన్నారు.

Follow Us