AP CM Jagan: నేడు సొంత ఊరుకు సీఎం జగన్ పయనం.. కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటన

|

Oct 02, 2021 | 7:34 AM

AP CM Jagan Kadapa Tour: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి తన సొంత జిల్లాలో..

AP CM Jagan: నేడు సొంత ఊరుకు సీఎం జగన్ పయనం.. కడప జిల్లాలో రెండు రోజుల పాటు పర్యటన
Jagan Kadapa
Follow us on

AP CM Jagan Kadapa Tour: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రెండో రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ మరోసారి తన సొంత జిల్లాలో ఇవాళ, రేపు రెండు రోజుల పాటు పర్యటించనున్నారు.ఈరోజు సాయంత్రం 4.30 గంటలకు సీఎం జగన్ ప్రత్యేక హెలికాప్టర్‌లో ఇడుపులపాయకు చేరుకోనున్నారు.

సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు తగిన ఏర్పాట్లను చేస్తున్నారు. పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌లు పరిశీలించారు. ఇడుపులపాయలోని హెలిప్యాడ్, సీఎం బస చేసే నివాసం వద్ద పోలీసు సిబ్బందికి పలు సూచనలు చేశారు.

ఈరోజు రాత్రి సీఎం జగన్ ఇడుపులపాయలోనే బస చేయనున్నారు. ఇడుపులపాయలో పార్టీ నేతలు..జిల్లా నాయకులతో సమావేశం కానున్నారు. అనంతరం రేపు ఉదయం సీఎం జగన్ భార్య భారతి తండ్రి ప్రథమ వర్ధంతి సందర్భంగా పులివెందుల తోటలోని గంగిరెడ్డి సమాధి వద్ద నివాళులు అర్పించి ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొని.. తిరిగి రేపు రాత్రికి తాడేపల్లికి చేరుకోనున్నారు.

Also Read: Horoscope Today: ఈరోజు ఈ రాశివారికి ఆకస్మికంగా ధనలాభం కలిగే అవకాశం ఉంది. ఏ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే