ఏపీ ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు

| Edited By:

Jan 14, 2020 | 11:18 AM

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ తెల్లవారుజామున భోగి మంటలను వేసి సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలికారు తెలుగు ప్రజలు. కాగా సంక్రాంతిని పురస్కరించుకొని ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ‘‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని […]

ఏపీ ప్రజలకు జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. ఈ తెల్లవారుజామున భోగి మంటలను వేసి సంక్రాంతి సంబరాలకు స్వాగతం పలికారు తెలుగు ప్రజలు. కాగా సంక్రాంతిని పురస్కరించుకొని ఏపీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ‘‘రైతు సంక్షేమానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలకు తోడుగా ఈ ఏడాది ప్రకృతి కూడా ఆశీర్వదించింది. రైతుల పండుగగా విశిష్టంగా జరుపుకునే ఈ సంక్రాంతి ప్రతి ఇంటా కొత్త ఆనందాలను తీసుకురావాలని, పైరుపచ్చని కళకళలతో రాష్ట్రం ఎల్లప్పుడూ సుభిక్షంగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను’’ అని జగన్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ గత 28రోజులుగా ఆందోళన చేస్తోన్న అమరావతి ప్రాంతవాసులు ఈ సంక్రాంతి పండుగను జరుపుకోని విషయం తెలిసిందే.