గ్యాస్ లీకేజీ ఘటనలో 8కి పెరిగిన మృతుల సంఖ్య

|

May 07, 2020 | 11:18 AM

విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన కెమికల్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది.

గ్యాస్ లీకేజీ ఘటనలో 8కి పెరిగిన మృతుల సంఖ్య
Follow us on

విశాఖ ఆర్ఆర్ వెంకటాపురంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమలో జరిగిన కెమికల్ గ్యాస్ లీక్ ఘటనలో మృతి చెందినవారి సంఖ్య ఎనిమిదికి పెరిగింది. బాధితుల సంఖ్య క్షణక్షణానికీ పదుల సంఖ్యలో పెరుగుతోంది. గ్యాస్ లీకేజి ఇంకా పూర్తిగా అదుపులోనికి రాకపోవడంతో  పరిస్థితి తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతున్నది. సంఘటన జరిగిన ఆర్ వెంకటాపురంలోనే ముగ్గురు మరణించగా, కేజీహెచ్ లో చికిత్స పొందుతూ మరో ఐదుగురు మరణించినట్లు అధికారులు చెబుతున్నారు. కేజీహెచ్ గ్యాస్ లీకేజీ బాధితులతో కిక్కిరిసిపోయింది. రోడ్లపై అపస్మారక స్థితిలో పడిపోయి కనిపిస్తున్న వారిని ఆసుపత్రులకు  తరలించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. రోడ్ల పక్కన, పొలాల్లో, మురుగు కాలువల్లో పలువురు పడిపోయి ఉండటం కనిపిస్తున్నది.