మొన్న కడప.. నేడు కర్నూల్.. బాబు సమక్షంలోనే..!

| Edited By:

Dec 04, 2019 | 6:37 PM

అసలే ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలై, ప్రతిపక్షానికే పరిమితమైన చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ తీరుతో మరింత విసుగును తెప్పిస్తున్నారు. ఓ వైపు తన పార్టీ నుంచి కీలక నేతలందరూ టీడీపీని వీడి మరో పార్టీ కండువాను కప్పుకుంటుంటే.. మరోవైపు కార్యకర్తలు అధినేత ముందే గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో మొన్నటికి మొన్న కడపలో జరిగిన పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో చంద్రబాబు సమక్షంలోనే కార్యకర్తలు కొట్టుకోగా.. తాజాగా కర్నూల్ జిల్లాలోనూ అలాంటి […]

మొన్న కడప.. నేడు కర్నూల్.. బాబు సమక్షంలోనే..!
Follow us on

అసలే ఈ సారి జరిగిన ఎన్నికల్లో ఓటమి పాలై, ప్రతిపక్షానికే పరిమితమైన చంద్రబాబుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ తీరుతో మరింత విసుగును తెప్పిస్తున్నారు. ఓ వైపు తన పార్టీ నుంచి కీలక నేతలందరూ టీడీపీని వీడి మరో పార్టీ కండువాను కప్పుకుంటుంటే.. మరోవైపు కార్యకర్తలు అధినేత ముందే గొడవలకు దిగుతున్నారు. ఈ క్రమంలో మొన్నటికి మొన్న కడపలో జరిగిన పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశంలో చంద్రబాబు సమక్షంలోనే కార్యకర్తలు కొట్టుకోగా.. తాజాగా కర్నూల్ జిల్లాలోనూ అలాంటి సంఘటనే రిపీట్ అయ్యింది.

పాణ్యంలో జరిగిన టీడీపీ నియోజకవర్గ సమీక్ష రసాభాసగా మారింది. చంద్రబాబు సమక్షంలో టీడీపీ నేతలు కొట్టుకున్నారు. సమావేశం జరుగుతుండగా టీడీపీ నేతలైన సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మల్లికార్జునరెడ్డి మధ్య వాగ్వాదం మొదలైంది. సభలో వారిద్దరు ఒకరిపై మరొకరు పరస్పర దూషణలకు దిగారు. అయితే ఈ ఘటనపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. తమషా చేస్తున్నారా..? నా ముందే ఘర్షణ పడతారా..? అంటూ ఆయన ఫైర్ అయ్యారు. అయినప్పటికీ వారు అధినేత మాటలు పెద్దగాా పట్టించుకోలేదని తెలుస్తోంది.

కాగా గత మంగళవారం కడపలో జరిగిన టీడీపీ నియోజకవర్గ సమీక్షలో తమ సమస్యలను చంద్రబాబుకు చెప్పుకుంటోన్న సుబ్బయ్య అనే దళిత వ్యక్తిపై, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌ రెడ్డి అనుచరులు దాడి చేశారు. దీనిపై ఆ సమావేశంలో బాబు సీరియస్ అయ్యారు. ఇక ఈ ఘటనపై సుబ్బయ్య వర్గీయులు రిమ్స్ ఔట్ పోస్ట్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్న విషయం తెలిసిందే.