Breaking: జగన్ సర్కార్ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు..!

అమరావతి ప్రాంతంలోని భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించడంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను నాలుగు వారాలు సస్పెండ్ చేసింది.

Breaking: జగన్ సర్కార్ జారీ చేసిన జీవోను సస్పెండ్ చేసిన హైకోర్టు..!

Updated on: May 15, 2020 | 7:05 PM

అమరావతి ప్రాంతంలోని భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించడంపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోను నాలుగు వారాలు సస్పెండ్ చేసింది. తదుపరి విచారణను జూన్ 17కు వాయిదా వేసింది.  విచారణలో భాగంగా సీఆర్డీఏలోని సెక్షన్‌ 41 ప్రకారం మాస్టర్‌ ప్లాన్‌ని మార్పు చేయాలంటే స్థానిక సంస్థలు, గ్రామ కమిటీల నుంచి అభిప్రాయాలు సేకరించాలని రాజధాని రైతుల తరపున న్యాయవాది వాదించగా.. రాజధాని మార్పుకు ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రక్రియ గురించి ప్రభుత్వం తరుపున న్యాయవాది వాదించారు. ఈ క్రమంలో ఈ జీవోను సస్పెండ్ చేస్తూ.. దీనిపై విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

కాగా అమరావతి ప్రాంతంలో ఆర్‌5 జోన్‌ను సృష్టించిన ఏపీ ప్రభుత్వం.. అక్కడి భూములను రాజధానిలోని 29 గ్రామాల వారికి కాకుండా గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు పెదకాకాని, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల మండలాలకు చెందిన వారికి ఇచ్చే విధంగా జీవో జారీ చేసింది. ఈ క్రమంలో 1300 ఎకరాలను వారికి కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సీఆర్‌డీయే చట్టాన్ని అందులోని మాస్టర్ ప్లాన్‌ను మార్పులు చేస్తూ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. అయితే ఈ ప్రతిపాదనలు చట్టపరమైన ప్రక్రియను, నింబంధనలను పాటించకుండా చేస్తున్నారని, సీఆర్‌డీయే చట్టానికి, మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ ప్రక్రియ జరుగుతోందని రాజధాని రైతులు హైకోర్ట్ ను ఆశ్రయించారు. వేసవి సెలవులు అనంతరం జూన్ 17 వరకు విచారణ వాయిదా వేసింది.

Watch Live: లాక్ డౌన్ అమలుపై కేసీఆర్ కీలక నిర్ణయం

Read This Story Also: నాగార్జునతో భారీ హిట్‌ కొట్టిన ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా..!

 

Loading...
Unable to load recommendations.
Follow Us