నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ శాఖలో కొలువుల జాతర..!

| Edited By: Pardhasaradhi Peri

Oct 19, 2019 | 11:22 AM

నిరుద్యోగులకు మరోసారి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ పరిధిలో 50 సహాయ పబ్లిక్ ప్రోసెక్యూటర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేసే పనుల్లో ఏపీ రిక్రూట్ మెంట్ బోర్డు అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ సెప్టెంబర్ 30న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఆన్ లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. మరుసటి రోజు (31.10.2019) సాయంత్రం 5 గంటల వరకు […]

నిరుద్యోగులకు తీపికబురు.. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ శాఖలో కొలువుల జాతర..!
Follow us on

నిరుద్యోగులకు మరోసారి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ ప్రకటించింది. రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ పరిధిలో 50 సహాయ పబ్లిక్ ప్రోసెక్యూటర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియకు సంబంధించిన విధి విధానాలను సిద్ధం చేసే పనుల్లో ఏపీ రిక్రూట్ మెంట్ బోర్డు అధికారులు నిమగ్నమయ్యారు. రాష్ట్ర ప్రాసిక్యూషన్ శాఖ సెప్టెంబర్ 30న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో ఆన్ లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపింది. మరుసటి రోజు (31.10.2019) సాయంత్రం 5 గంటల వరకు www.slprb.ap.in వెబ్ సైట్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఇక దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్ 17వ తేదీ (ఆదివారం) రాతపరీక్ష నిర్వహించనున్నారు. మొదటి పేపర్ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.. రెండవ పేపర్ మధ్యాహ్నం 2.30 నిమిషాల నుంచి సాయంత్రం 5.30 నిమిషాల వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, పరీక్షకు ఏడు రోజుల ముందు హాల్ టికెట్లు అధికారికి వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకునే వీలు కల్పించినట్లు రాష్ట్ర పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డ్ ఛైర్మన్ అమిత్ గర్గ్ తెలిపారు.