ఏపీలో ఐదుగురు ఛైర్మన్లపై  వేటు!

| Edited By: Anil kumar poka

Aug 28, 2019 | 8:07 AM

రాష్ట్రంలోని ఐదు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఛైర్మన్లపై వేటు పడింది. అథారిటీల ఛైర్మన్లు సహా కొందరు సభ్యులను తొలగిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ వి.జగదీశ్ బాబు, మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం తొలగించింది. కడప అన్నమయ్య అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ బలిశెట్టి హరిప్రసాద్, బొబ్బిలి ఛైర్మన్ తెంటు లక్ష్మణ్‌ కుమార్, అనంతపురం, హిందూపురం అథారిటీల ఛైర్మన్‌ జి.లక్ష్మీనారాయణ, మచిలీపట్నం […]

ఏపీలో ఐదుగురు ఛైర్మన్లపై  వేటు!
Follow us on

రాష్ట్రంలోని ఐదు అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీల ఛైర్మన్లపై వేటు పడింది. అథారిటీల ఛైర్మన్లు సహా కొందరు సభ్యులను తొలగిస్తూ రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ వి.జగదీశ్ బాబు, మరో ముగ్గురు సభ్యులను ప్రభుత్వం తొలగించింది. కడప అన్నమయ్య అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఛైర్మన్ బలిశెట్టి హరిప్రసాద్, బొబ్బిలి ఛైర్మన్ తెంటు లక్ష్మణ్‌ కుమార్, అనంతపురం, హిందూపురం అథారిటీల ఛైర్మన్‌ జి.లక్ష్మీనారాయణ, మచిలీపట్నం ఛైర్మన్ బూరగడ్డ వేదవ్యాస్‌లను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.