
జులై 8న వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 27 లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇస్తామని సీఎం జగన్ వెల్లడించారు. మహిళల పేర్లపై ఇళ్ల పట్టాలు జారీ చేస్తామని..అవి అందుకున్న వారందికీ ఉచితంగా ఇళ్లు కూడా కట్టిస్తామని సీఎం హామీ ఇచ్చారు. అలాగే నామినేటెడ్ పనులు, పదవుల్లో 50 శాతం మహిళలకు ఇవ్వాలని గొప్ప చట్టం తెచ్చామని తెలిపారు. డ్వాక్రా సంఘాల ఖాతాల్లో డబ్బులు జమ చేసిన అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల నుంచి డ్వాక్రా మహిళలతో మాట్లాడిన సీఎం జగన్ ఈ శుభవార్త వారితో పంచుకున్నారు.