చదువుకున్న శక్తి అలాంటిది : జగన్
ఇంటర్నేషనల్ లిటరసీ డే పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సందేశం ఇచ్చారు. ఏపీలో వంద శాతం అక్షరాస్యతకు మార్గం సుగమం చేశామని చెప్పారు.
ఇంటర్నేషనల్ లిటరసీ డే పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక సందేశం ఇచ్చారు. ఏపీలో వంద శాతం అక్షరాస్యతకు మార్గం సుగమం చేశామని చెప్పారు. విద్యకు ఉన్న గొప్పతనాన్ని ఈ సందర్భంగా ఆయన వెల్లడించే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి తన ట్విట్టర్ అకౌంట్లో స్పందించారు. ‘విద్య జీవితాలను శక్తివంతం చేయగలదు, జీవితాల్ని మార్చగలదు. అంతేకాదు. జీవితాల్నిఉద్ధరించగలదు; పేదరికం, అసమానతలను ఎదుర్కోవడానికి ఇది ఒక ముఖ్యమైన సాధనం. ‘అమ్మ ఒడి’, ‘నాడు-నేడు’, ‘విద్యా దీవన’ వంటి పథకాల ద్వారా తాము ఏపీలో విద్యావ్యవస్థను పునర్నిర్వచించాం. 100% అక్షరాస్యతకు మార్గం సుగమం చేస్తున్నాము.’ అని చెప్పారు ముఖ్యమంత్రి. హ్యాష్ ట్యాగ్ జోడించి #InternationalLiteracyDay అని పేర్కొన్నారు.