ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై పిటిషన్

|

Jun 14, 2019 | 4:18 PM

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ రిపబ్లిక్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్ కుమార్ పిటిషన్ వేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ పథకాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. అంతేకాదు ఆయా పథకాల ద్వారా ఎన్నికల్లో ఆయన ఓటర్లను ప్రభావితం చేశారని పిటీషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు సొంత ఖర్చు […]

ఏపీ హైకోర్టులో చంద్రబాబుపై పిటిషన్
Follow us on

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఎన్నికల ప్రచారానికి ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేశారంటూ రిపబ్లిక్ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి బోరుగడ్డ అనిల్ కుమార్ పిటిషన్ వేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పటికీ అన్నదాత సుఖీభవ, పసుపు-కుంకుమ పథకాల పేరుతో ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశారని తెలిపారు. అంతేకాదు ఆయా పథకాల ద్వారా ఎన్నికల్లో ఆయన ఓటర్లను ప్రభావితం చేశారని పిటీషన్‌లో పేర్కొన్నారు. చంద్రబాబు నాయుడు సొంత ఖర్చు కింద ఆ నిధులను జమ చేయాలంటూ అనిల్‌ కుమార్‌ కోరారు. పీటీషన్‌ను స్వీకరించిన హైకోర్టు ఈ నెల 18న విచారణ జరపనుంది.