పిల్లలను బడికి పంపే ప్రతి తల్లి బ్యాంకు ఖాతాలో 15 వేలు జమచేసేలా ‘అమ్మ ఒడి’ పధకాన్ని అమలు చేస్తామని వైఎస్ జగన్ ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో ఈ పధకానికి ఆమోదముద్ర లభించింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు పేద విద్యార్థులందరికీ ఈ అమ్మఒడి పధకం వర్తిస్తుందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. తల్లి లేని పిల్లల విషయంలో వాళ్ళ సంరక్షకులకు ఈ ఆర్ధిక సాయాన్ని అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.
అమ్మ ఒడి పథకం అర్హతలు, కేటాయించిన బడ్జెట్ వివరాలు…