Andhra Pradesh: స్నేహితుని అప్పు కోసం పూచీకత్తుగా ఉన్నాడు.. చివరికి రుణదాతల చేతిలో బలి

అప్పు కోసం పూచీకత్తుగా వ్యవహరించిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం కలకల రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నెలో శ్రీకాంత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇటీవల శ్రీకాంత్ స్నేహితుడు ఒకతడకి అప్పు అవసరం అయ్యింది. దీంతో అతడు రూ.15 లక్షలు అప్పు తీసుకున్నాడు.

Andhra Pradesh: స్నేహితుని అప్పు కోసం పూచీకత్తుగా ఉన్నాడు..  చివరికి రుణదాతల చేతిలో బలి
Death

Updated on: Jun 04, 2023 | 4:49 PM

అప్పు కోసం పూచీకత్తుగా వ్యవహరించిన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం కలకల రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే వైఎస్సార్ జిల్లా చింతకొమ్మదిన్నెలో శ్రీకాంత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ఇటీవల శ్రీకాంత్ స్నేహితుడు ఒకతడకి అప్పు అవసరం అయ్యింది. దీంతో అతడు రూ.15 లక్షలు అప్పు తీసుకున్నాడు. అయితే ఈ అప్పుకు పూచీకత్తుగా శ్రీకాంత్ ఉన్నాడు. కొన్నిరోజులకు అప్పు తీసుకున్న శ్రీకాంత్ స్నేహితుడు రుణం ఇచ్చిన వారికి అప్పు తిరిగి చెల్లించలేదు. దీంతో చివరికి పూచీకత్తుగా ఉన్న శ్రీకాంత్‌ను రుణదాతలు అడిగారు. ఈ క్రమంలో వాళ్ల మధ్య వాగ్వాదం జరిగి చివరికి ఘర్షణకు దారి తీసింది.

అయితే ఈ గొడవలో శ్రీకాంత్‌‌కు తీవ్రంగా గాయాలయ్యాయి. చివరికి అక్కడికక్కడే అతను మృతి చెందాడు. ఆధారాలు దొరకకుండా చేయాలనే ఉద్దేశంతో మృతదేహంపై నిందితులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనలు స్థలానికి చేరుకున్నారు. ఈ హత్య కేసులో ఏడుగురు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. నిందితుల్లో ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..