లాల్చౌక్లో షా.. లడఖ్లో ధోనీ
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశం ముస్తాబైంది. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి జమ్ముకశ్మీర్లోని ప్రతి గ్రామ పంచాయితీ ఆఫీసులపై జెండా ఎగురవేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇందు కోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆదేశాలు జారీ చేశారు. ఇక శ్రీరనగర్ లోని లాల్చౌక్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. లడఖ్లో ధోనీ జాతీయ జెండా ఎగరవేయనున్నారు. అలాగే స్వాతంత్ర్యదినోత్సవ […]
భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశం ముస్తాబైంది. ఈ సందర్భంగా జమ్మూకశ్మీర్ వ్యాప్తంగా స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి జమ్ముకశ్మీర్లోని ప్రతి గ్రామ పంచాయితీ ఆఫీసులపై జెండా ఎగురవేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇందు కోసం ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లకు జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఆదేశాలు జారీ చేశారు. ఇక శ్రీరనగర్ లోని లాల్చౌక్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా.. లడఖ్లో ధోనీ జాతీయ జెండా ఎగరవేయనున్నారు. అలాగే స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో జమ్మూకశ్మీర్ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కళాకారుల బృందాలతో జమ్మూకశ్మీర్లో సందడి నెలకొంది.