కరోనాతో లక్షమంది మరణిస్తారేమో ! ట్రంప్

| Edited By: Anil kumar poka

May 04, 2020 | 12:07 PM

కరోనా వైరస్ తో లక్షమంది మరణించవచ్చునని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంచనా వేశారు. 60 వేల నుంచి 80 వేల మంది అమెరికన్లు మృతి చెందవచ్చునని మొదట వ్యాఖ్యానించిన ఆయన ఈ సంఖ్యను లక్షకు పెంచేశారు...

కరోనాతో లక్షమంది మరణిస్తారేమో ! ట్రంప్
Follow us on

కరోనా వైరస్ తో లక్షమంది మరణించవచ్చునని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అంచనా వేశారు. 60 వేల నుంచి 80 వేల మంది అమెరికన్లు మృతి చెందవచ్చునని మొదట వ్యాఖ్యానించిన ఆయన ఈ సంఖ్యను లక్షకు పెంచేశారు. అయితే ఈ సంవత్సరాంతం లోగా కరోనాకు ఉత్తమ చికిత్సగా వ్యాక్సీన్ ను అభివృధ్ది చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. వైట్ హౌస్ లో కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ ఆంథోనీ ఫోసీ మాత్రం ఈ వ్యాక్సీన్ తయారీకి ఏడాది లేదా 18 నెలలు పట్టవచ్ఛునని అంటున్నారు. ఇలా ఉండగా దేశ ఆర్ధిక వ్యవస్థ మీద ప్రధానంగా దృష్టి నిలిపిన ట్రంప్.. లాక్ డౌన్ పట్ల నిర్లక్ష్యం వవహరించడంతో సగానికి పైగా రాష్ట్రాల్లో తిరిగి జనజీవనం ప్రారంభమైంది. కార్యాలయాల్లో ఉద్యోగులు క్రమంగా ఇందులకు హాజరవుతుండగా ఫ్లోరిడా, కాలిఫోర్నియా బీచ్ లలో విజిటర్లు పోటెత్తుతున్నారు.