లోక్సభలో వైసీపీకి బంపర్ ఆఫర్..!
వైసీపీకి లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి దక్కబోతోందా..? అంటే అవుననే సంకేతాలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి. ఇది ఇలా ఉంటే అధికారక పార్టీకి భారీ మెజార్టీ ఉన్నా.. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకే ఇవ్వడం లోక్సభలో ఆనవాయితీగా వస్తోంది. ఇక అటు మిత్రపక్షాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న బీజేపీ.. ఈసారి ఆ ఆఫర్ను అధికార వైసీపీకి కట్టబెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఆ పార్టీ ఈ ఆఫర్పై సమాలోచనలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వైసీపీ తరపున గెలిచిన గిరిజన […]
వైసీపీకి లోక్సభలో డిప్యూటీ స్పీకర్ పదవి దక్కబోతోందా..? అంటే అవుననే సంకేతాలు రాజకీయ వర్గాల్లో వినబడుతున్నాయి. ఇది ఇలా ఉంటే అధికారక పార్టీకి భారీ మెజార్టీ ఉన్నా.. డిప్యూటీ స్పీకర్ పదవి విపక్షాలకే ఇవ్వడం లోక్సభలో ఆనవాయితీగా వస్తోంది. ఇక అటు మిత్రపక్షాలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్న బీజేపీ.. ఈసారి ఆ ఆఫర్ను అధికార వైసీపీకి కట్టబెట్టబోతున్నట్లు సమాచారం. అయితే ఆ పార్టీ ఈ ఆఫర్పై సమాలోచనలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.
కాగా వైసీపీ తరపున గెలిచిన గిరిజన మహిళకు లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలనే యోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. మరి దీనిపై అధికారికంగా ఎటువంటి నిర్ణయం వెలువడుతుందో వేచి చూడాలి.