తమిళ తంబీల 5పైసల బిర్యానీ.. లాగించేయాలి మళ్లీ మళ్లీ..
ఎంత చీప్గా వేసుకున్న ప్లేట్ బిర్యానీ ధర మినిమం రూ. 70లుగా ఉంటుంది. అయితే ఓ చోట మాత్రం ఒకటిన్నర ప్లేట్ బిర్యానీని 5పైసలకే అందించారు. నమ్మలేకపోతున్నారా..! నిజంగా నిజమండి. తమిళనాడులోని దిండుక్కల్లో ఓ దుకాణంలో ఒకటిన్నర ప్లేట్ బిర్యానీని 5పైసలకే అందించారు. వివరాల్లోకి వెళ్తే.. దిండుక్కల్ బస్టాండ్ సమీపంలో ఉండే ముజిఫ్ బిర్యానీ దుకాణం వారు ఇటీవల ఓ ఆఫర్ పెట్టారు. 5 పైసలను తీసుకొచ్చిన మొదటి వంద మందికి ఒకటిన్నర ప్లేటు చికెన్ బిర్యానీ […]
ఎంత చీప్గా వేసుకున్న ప్లేట్ బిర్యానీ ధర మినిమం రూ. 70లుగా ఉంటుంది. అయితే ఓ చోట మాత్రం ఒకటిన్నర ప్లేట్ బిర్యానీని 5పైసలకే అందించారు. నమ్మలేకపోతున్నారా..! నిజంగా నిజమండి. తమిళనాడులోని దిండుక్కల్లో ఓ దుకాణంలో ఒకటిన్నర ప్లేట్ బిర్యానీని 5పైసలకే అందించారు.
వివరాల్లోకి వెళ్తే.. దిండుక్కల్ బస్టాండ్ సమీపంలో ఉండే ముజిఫ్ బిర్యానీ దుకాణం వారు ఇటీవల ఓ ఆఫర్ పెట్టారు. 5 పైసలను తీసుకొచ్చిన మొదటి వంద మందికి ఒకటిన్నర ప్లేటు చికెన్ బిర్యానీ ఇస్తామని సోషల్ మీడియాలో ప్రకటించారు. దీనికి స్పందించిన చాలా మంది బుధవారం ఉదయం నుంచే దుకాణం వద్ద ఐదు పైసలతో గుమిగూడారు. వారందరి పేర్లు, సెల్ఫోన్ నెంబర్లు తీసుకొని బిర్యానీని అందించారు. అయితే ఇటీవల కాలంలో ఐదు పైసలు దాదాపుగా కనుమరుగు అవ్వగా.. చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయారు. కాగా మనం ఉపయోగించిన వస్తువులు, నాణేలపై రానున్న తరానికి అవగాహన కల్పించేందుకే తాము ఇలా చేసినట్లు దుకాణం యజమాని ముజిఫర్ రహ్మాన్ తెలిపారు.