Viral Video: చుట్టూ మంటలు.. ప్రాణాలకు తెగించి కంగారూలను కాపాడిన ఓ వ్యక్తి.. నెట్టింట్లో వీడియో వైరల్

|

Mar 29, 2022 | 3:11 PM

Viral Video: ర‌ష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంతో అనేమంది జీవితాలు అత‌లాకుత‌లం అయిపోతున్నాయి. పశు పక్ష్యాదులు సైతం యుద్ధంకారణంగా మృత్యువాత పడుతున్నాయి..

Viral Video: చుట్టూ మంటలు.. ప్రాణాలకు తెగించి కంగారూలను కాపాడిన ఓ వ్యక్తి.. నెట్టింట్లో వీడియో వైరల్
Russia Ukraine Crisis
Follow us on

Viral Video: ర‌ష్యా-ఉక్రెయిన్ (Russia-Ukraine) మ‌ధ్య జ‌రుగుతున్న యుద్ధంతో అనేమంది జీవితాలు అత‌లాకుత‌లం అయిపోతున్నాయి. పశు పక్ష్యాదులు సైతం యుద్ధంకారణంగా మృత్యువాత పడుతున్నాయి. ప్రకృతి అందాలతో భూతాల స్వర్గంగా కనిపించే ఉక్రెయిన్ ఇప్పుడు బాంబు దాడులతో ఉక్రెయిన్ స్మశానాన్ని త‌ల‌పిస్తోంది. నిత్యం బాంబు మోత‌ల‌తో ఉక్రెయిన్‌ దద్దరిల్లిపోతోంది.  కొంతమంది తమ ప్రాణాల కోసం పొరుగుదేశాలకు తరలిపోతుంటే.. మరికొందరు దిక్కుతోచని స్థితిలో ఉక్రెయిన్ లోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో యుద్ధం ప్రారంభ‌మైన‌నాటినుంచి ఎక్కడో చోట కొందరు ఉక్రెయిన్‌ ప్రజలకు అండగా నిలుస్తూ వారి ప్రాణాల‌ను కాపాడుతూ ప్రశంస‌లు పొందుతున్నారు. అయితే, ఓ వ్యక్తి ఎనిమిది మూగ జీవాల ప్రాణాలు కాపాడి, అందరితో శ‌భాష్ అనిపించుకున్నాడు.

బాంబు దాడుల వ‌ల్ల ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలోగ‌ల ఫెల్డ్‌మాన్‌ ఎకోపార్క్‌లో మంట‌లు చెల‌రేగాయి. అందులోని మూగ‌జీవాలు మంట‌ల్లో చిక్కుకున్నాయి. విష‌యం తెలుసుకున్న ఓ వ్యక్తి త‌న ప్రాణాల‌కు తెగించి ఎనిమిది కంగారూల‌ను కాపాడాడు. అనంత‌రం వాటిని వాహ‌నంలో అక్కడినుంచి వేరేచోటుకు త‌ర‌లించాడు. కంగారూల‌తో వెళ్తున్న ఆ వ్యక్తి వీడియో వైర‌ల్ అవుతుంది. మూగజీవాలను కాపాడిన ఆ వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. నువ్వు హీరోవి బాస్‌ అంటూ పొగుడుతున్నారు.

సెంటర్ ఫర్ సివిల్ లిబర్టీస్ (ఉక్రెయిన్) హెడ్ ఒలెక్సాండ్రా మాట్విచుక్ ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో కంగారులను రక్షించిన వ్యక్తికీ కృతఙ్ఞతలు చెప్పారు.

“ఎకోపార్క్ నుండి జంతువులను రక్షించే కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కంగారూలను రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే దురదృష్టవశాత్తు ఈ పార్క్ ఆవరణ పదేపదే బాంబు దాడికి గురవుంటుంది. అయితే అక్కడ జంతువులు సురక్షితంగా ఉంటాయని తాము నమ్ముతున్నట్లు చెప్పారు

” ప్రమాదంలో ఉన్న జంతువులను రక్షించడంలో వాలంటీర్లు, సిబ్బంది, స్నేహితులు, సాధారణ వ్యక్తులు, వ్యాపారస్థులు, కమ్యూనిటీ సంస్థలు తమకు ఆర్థికంగా సహాయం చేస్తున్నాయని .. అందుకనే మా రెస్క్యూ కార్యకలాపాలను సులభంగా చేయగలుగుతున్నామని చెప్పారు.

Also Read: Haryana: చపాతీ ఎక్కువ తిన్నదని అత్తగారిని కొట్టిన కోడలు.. పోలీసుల అదుపులో కోడలు, ఆమె ఫ్యామిలీ