Sri Lanka Crisis: ఉద్యోగుల జీతాలు కోసం నోట్ల ముద్రణ.. మరింత సంక్షోభం తప్పదంటున్న ఆర్థిక నిపుణులు..

|

May 17, 2022 | 5:20 PM

ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు నగదు ముద్రించేందుకు శ్రీలంక సిద్ధమైంది. దీంతో పరిస్థితులు మరింత ముదిరే అవకాశముందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Sri Lanka Crisis: ఉద్యోగుల జీతాలు కోసం నోట్ల ముద్రణ.. మరింత సంక్షోభం తప్పదంటున్న ఆర్థిక నిపుణులు..
Sri Lanka Money
Follow us on

Print money in Sri Lanka: శ్రీలంక గతంలో ఎన్నడూ లేని ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.. రాజపక్సే ప్రభుత్వం దిగిపోయినప్పటికీ.. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు లంకేయులను వెంటాడుతూనే ఉన్నాయి. తాజాగా.. రణిల్ విక్రమసింఘే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించేందుకు నగదు ముద్రించేందుకు సిద్ధమైంది. దీంతో పరిస్థితులు మరింత ముదిరే అవకాశముందని ఆర్ధిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బలవంతంగా డబ్బులు ముద్రించాల్సి వస్తోందని శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే అన్నారు. 2022 మొదటి త్రైమాసికంలో దేశం 588 బిలియన్ రూపాయలను ముద్రించింది. ఫిబ్రవరి 2020లో డబ్బును విస్తృతంగా ముద్రించడం ప్రారంభించింది. దీనితో పాటు ఇతర తప్పిదాలతో ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ సంక్షోభానికి దారితీసింది. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టేందుకు, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు చెల్లించడానికి డబ్బును ముద్రించవలసి వస్తుందని రణిల్ విక్రమసింఘే పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అంతకుముందు తీసుకున్న నిర్ణయాలను తీసుకుంటుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

శ్రీలంక 2021లో 1.2 ట్రిలియన్ రూపాయలను ముద్రించింది. 2022 మొదటి త్రైమాసికంలో 588 బిలియన్ రూపాయలను ముద్రించింది. డిసెంబర్ 2019 – ఆగస్టు 2021 మధ్య శ్రీలంకలో డబ్బు సరఫరా 42% పెరిగింది. ద్రవ్యలోటును తగ్గించడానికి, పన్ను రేట్లు తక్కువగా ఉంచడానికి ఉద్దేశపూర్వకంగా ఈ నగదు మిగులు ఏర్పడింది. ఈ క్రమంలో శ్రీలంక మాజీ ప్రభుత్వం ఆర్థిక విధానాలను సమర్థించుకుంది. ఆధునిక ద్రవ్య సిద్ధాంతంపై ఆర్థికవేత్తలు దీనిపై ఆగ్రహం సైతం వ్యక్తంచేశారు. ఆచరణలో ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నాయి. ఈ క్రమంలో శ్రీలంక ఫిబ్రవరి 2020లో డబ్బును విస్తృతంగా ముద్రించడం ప్రారంభించింది. రాజపక్స ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్‌ల కంటే ముందే 2019 డిసెంబర్‌లో పన్నులను తగ్గించింది. పర్యాటకం, విదేశీ ఆదాయంలో ఐదవ అతిపెద్ద వనరుదేశం ఆ తర్వాత సంక్షోభానికి గురైంది.

స్వంత ఆర్థిక నిర్వహణలో బందీ అయిన రాజపక్స ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో IMFసాయం కూడా సరిగా అందలేదు. దీంతో ఆధునిక ద్రవ్య సిద్ధాంతం, విపత్తు పరిణామాల నుంచి తప్పించుకునేందుకు శ్రీలంక ప్రయోగాలు చేసింది. ప్రభుత్వం పన్నులు, రుణాల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి బదులుగా డబ్బును ముద్రించవచ్చని సూచించే సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది. అయితే.. శ్రీలంక కొన్నేళ్లుగా భారీగా రుణాలు తీసుకుంటోంది. అయితే చైనా నిధులతో కూడిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై దృష్టిసారించింది.

ఇవి కూడా చదవండి

ప్రస్తుత సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ నందలాల్ వీరసింఘే ప్రకారం.. శ్రీలంక డబ్బును ముద్రిస్తోంది. అలా చేయడం పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. అయితే దీనివలన కరెన్సీ విలువ తగ్గడం.. ద్రవ్యోల్బణం పెరగడం వలన అధిక ధరలకు కారణమవుతుంది. అయితే.. ప్రస్తుత పరిస్థితుల్లో “మనీ ప్రింటింగ్‌ను నిలిపివేసి, జీతాలు చెల్లించకపోతే పెద్ద సంక్షోభం ఏర్పడుతుంది” అని వీరసింగ్ అన్నారు. “రాష్ట్ర ఉద్యోగులకు జీతం, పెన్షన్ చెల్లించడం గురించి ఆందోళన అవసరం లేదన్నారు. అయితే దీన్ని కొంత బాధ్యతతో చేయాలని.. గతంలో చేసినట్లు కాకుండా ద్రవ్యోల్బణాన్ని 40 శాతానికి పెంచాలన్నారు.

కాగా.. శ్రీలంక విదేశీ రుణంపై మొదటి డిఫాల్ట్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే దాని గ్రేస్ పీరియడ్ ముగిసినా బుధవారం (మే 18) నాటికి బాండ్ హోల్డర్‌లకు వడ్డీని చెల్లించే అవకాశం కనిపించ లేదు.