Russian Ukraine War: రైల్వే స్టేషన్‌పై రాకెట్ దాడి.. 30 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు

Russian Rocket Strike: ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్‌ నుంచి బహిష్కరించినప్పటికి రష్యా దూకుడు తగ్గడం లేదు. ఉక్రెయిన్‌పై మళ్లీ రాకెట్‌ దాడులతో విరుచుకుపడుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 44వ రోజుకు చేరుకుంది.

Russian Ukraine War: రైల్వే స్టేషన్‌పై రాకెట్ దాడి.. 30 మంది మృతి.. 100 మందికి పైగా గాయాలు
Russian Rockets Hit Railway

Updated on: Apr 08, 2022 | 3:55 PM

ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్‌ నుంచి బహిష్కరించినప్పటికి రష్యా దూకుడు తగ్గడం లేదు. ఉక్రెయిన్‌పై మళ్లీ రాకెట్‌ దాడులతో(Russian Rocket Strike) విరుచుకుపడుతోంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 44వ రోజుకు చేరుకుంది. కానీ అది ముగిసే సూచనలు కనిపించడం లేదు. ఉక్రెయిన్‌పై రష్యా దాడులు ముమ్మరం చేసింది. తూర్పు ఉక్రెయిన్‌లోని క్రామాటోర్స్క్‌లోని రైల్వే స్టేషన్‌పై రష్యా శుక్రవారం రాకెట్‌తో దాడి చేసింది. ఈ ప్రమాదంలో కనీసం 30 మంది మరణించినట్లు సమాచారం. 100 మందికి పైగా గాయపడ్డారు. ఉక్రెయిన్ రైల్వే చీఫ్ మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్‌కు చేరుకున్న పౌరులను ఖాళీ చేయడానికి ఉపయోగించే రైల్వే స్టేషన్‌పై రాకెట్ దాడిలో 30 మందికి పైగా మరణించారు. డోనెట్స్క్ ప్రాంత గవర్నర్ మాట్లాడుతూ.. “రాకెట్ దాడి సమయంలో వేలాది మంది పౌరులు రైల్వే స్టేషన్‌లో ఉన్నారు. బయలుదేరడానికి వేచి ఉన్నారు.” రష్యా దళాల దాడుల తర్వాత అనేక ఉక్రెయిన్ నగరాల్లో భవనాలు, రోడ్లు, రవాణా వ్యాస్థ పూర్థి స్థాయిలో ధ్వంసమయ్యాయి. సాధారణ పౌరుల మరణాల కేసులు కూడా నిరంతరం పెరుగుతున్నాయి. ఉక్రెయిన్‌లో సామాన్య పౌరులపై జరుగుతున్న దాడులపై ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

ఉత్తర ఉక్రెయిన్ నుంచి రష్యా సైన్యం పూర్తిగా ఉపసంహరించుకుంది

అదే సమయంలో, ఉత్తర ఉక్రెయిన్ నుండి బెలారస్, రష్యా వైపు రష్యా సైన్యం పూర్తిగా ఉపసంహరించుకున్నట్లు UK రక్షణ మంత్రిత్వ శాఖ తన కొత్త నవీకరణలో ప్రకటించింది. వీటిలో, డోనెట్స్క్ , లుహాన్స్క్ వేర్పాటువాద ప్రాంతాలను కలిగి ఉన్న డాన్‌బాస్‌లో పోరాడటానికి దళాలు తూర్పు ఉక్రెయిన్‌కు బదిలీ చేశారు. ఈ బలగాలలో చాలా వరకు తూర్పున మోహరించడానికి ముందుగా సిద్ధం కావాల్సి ఉంది.

ఉక్రెయిన్‌లోని తూర్పు, దక్షిణ నగరాల్లో రష్యన్ సైన్యం దాడులు చేస్తోంది. రష్యా దళాలు మాస్కో ఆధీనంలో ఉన్న వ్యూహాత్మకంగా ముఖ్యమైన ఇజియం నగరం నుండి దక్షిణం వైపుకు పురోగమించాయి. ఉత్తరాన కైవ్ చుట్టుపక్కల ప్రాంతం నుంచి తన బలగాలను ఉపసంహరించుకున్న తర్వాత రష్యా ఇప్పుడు తూర్పు ఉక్రెయిన్‌ను ఆక్రమించాలనుకుంటోందని ఓ ఇంటర్నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఒక నివేదికలో పేర్కొంది.

ఇవి కూడా చదవండి: Pomegranate Benefits: ఆ వయసులోని మహిళలకు ఇదో బంగారు పండు.. రోజు ఒకటి తింటే చాలు నిత్య యవ్వనమే..

APS RTC: ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త ప్రయోగం.. బస్సుల్లోనే కొరియర్, కార్గో బుకింగ్‌..