
మయన్మార్లో భారీ భూకంపం సంభవించింది. దేశ రాజధానికి 260 కి.మీ దూరంలో ఉన్న సాగింగ్ నగరానికి సమీపంలో 7.7 తీవ్రతతో సంభవించింది. ఈ భారీ భూకంపం కారణంగా దేశవ్యాప్తంగా 20 మంది మరణించినట్లు సమాచారం. మయన్మార్ రాజధాని నేపిడాలో నిర్మాణంలో ఉన్న 1,000 పడకల ఆసుపత్రి నేలమట్టమైంది. అలాగే థాయిలాండ్ సరిహద్దులో ఉన్న ఒక మఠం కూడా పూర్తిగా ధ్వంసమైంది. ఉత్తర థాయిలాండ్ వరకు ఈ భూకంప ప్రకంపనలు వ్యాపించాయి. బ్యాంకాక్లో కొన్ని మెట్రో సేవలు నిలిపివేశారు.
అయితే మెట్రో స్టేషన్లో నిలిచి ఉన్న ఓ మెట్రో రైలు.. భూకంపం కారణంగా అటు ఇటూ కదులు కనిపించిన దృశ్యాలు భయంకరంగా ఉన్నాయి. దానికి సంబంధించిన ఒక వీడియో కూడా వైరల్గా మారింది. థాయ్ ప్రధాన మంత్రి పేటోంగ్టార్న్ షినవత్రా నగరంలో ‘అత్యవసర పరిస్థితిని’ ప్రకటించారు. అలాగే, బ్యాంకాక్లోని చతుచక్లో నిర్మాణంలో ఉన్న 30 అంతస్తుల భవనం పూర్తిగా కూలిపోయింది. దీంతో తీవ్ర ఆస్తినష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా సంభవించినట్లు తెలుస్తోంది.
At the time of the #Earthquake, some people were on the MRT and luckily the swaying moment had already stopped at the station. So, everyone ran out quickly while the station floor was swinging. #Thailand #Bangkok #Myanmar #แผ่นดินไหว pic.twitter.com/1XlClCWkfH
— कृतिका शर्मा (@Kriti_Sanatani) March 28, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.