శ్రీలంక ఉగ్రదాడి కేసు.. సౌదీ మత ప్రబోధకుడి అరెస్ట్

| Edited By:

May 13, 2019 | 9:46 AM

శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడి కేసులో కీలక రింగ్‌లీడర్‌గా అనుమానిస్తున్న జహ్రాన్ హషీంను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌదీ అరేబియాకు చెందిన విద్యావేత్త, మతబోధకుడు అయిన అలియార్.. సెంటర్ ఫర్ ఇస్లామిక్ గైడెన్స్ వ్యవస్థాపకుడు. అయితే ఈ సంస్థ ఆధ్వర్యంలో జహ్రాన్.. సొంత పట్టణమైన కట్టంకుడిలో మసీదు, మదర్సాను, లైబ్రరీని స్థాపించాడు. అలియార్‌కు జహ్రాన్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహించినట్టు తమకు సమాచారం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, పోలీసులు పూర్తి వివరాలు మాత్రం తెలపడానికి […]

శ్రీలంక ఉగ్రదాడి కేసు.. సౌదీ మత ప్రబోధకుడి అరెస్ట్
Follow us on

శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడి కేసులో కీలక రింగ్‌లీడర్‌గా అనుమానిస్తున్న జహ్రాన్ హషీంను.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సౌదీ అరేబియాకు చెందిన విద్యావేత్త, మతబోధకుడు అయిన అలియార్.. సెంటర్ ఫర్ ఇస్లామిక్ గైడెన్స్ వ్యవస్థాపకుడు. అయితే ఈ సంస్థ ఆధ్వర్యంలో జహ్రాన్.. సొంత పట్టణమైన కట్టంకుడిలో మసీదు, మదర్సాను, లైబ్రరీని స్థాపించాడు. అలియార్‌కు జహ్రాన్‌తో సంబంధాలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీలు కూడా నిర్వహించినట్టు తమకు సమాచారం ఉందని పోలీసులు పేర్కొన్నారు. అయితే, పోలీసులు పూర్తి వివరాలు మాత్రం తెలపడానికి నిరాకరించారు. కాగా, ఈస్టర్ సండే రోజున శ్రీలంకలో జరిగిన ఉగ్రదాడుల్లో 250 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. 400 మందికిపైగా క్షతగాత్రులయ్యారు.