మూడు రోజుల్లో 7 ఖండాలు చుట్టేసిన ఇద్దరు ఇండియన్స్.. గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేశారు..

|

Jan 10, 2023 | 5:12 PM

2020లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళ ఖవ్లా అల్ రొమైతి నెలకొల్పిన 3 రోజుల, 14 గంటల, 46 నిమిషాల 48 సెకన్ల రికార్డును ఈ ఇద్దరు వ్యక్తులు అధిగమించారు.

మూడు రోజుల్లో 7 ఖండాలు చుట్టేసిన ఇద్దరు ఇండియన్స్..  గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బ్రేక్ చేశారు..
,guinness,world Records
Follow us on

ఇద్దరు ఇండియన్స్ చేసిన సుదూర ప్రయాణం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం కల్పించింది. ప్రపంచ రికార్డును బద్దలు కొట్టడానికి ఇద్దరు భారతీయ వ్యక్తులు 4 రోజులల్లోనే మొత్తం ఏడు ఖండాలను సందర్శించారు. ఆ ఇద్దరు వ్యక్తుల 3 రోజుల, 1 గంట, 5 నిమిషాల 4 సెకన్లలో మొత్తం ఏడు ఖండాలను సందర్శించి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను బద్దలు కొట్టారు.

అలీ ఇరానీ, సుజోయ్ కుమార్ మిత్రా అంటార్కిటికా నుండి డిసెంబర్ 4 న బయలుదేరారు. డిసెంబర్ 7 న ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ చేరుకున్నప్పుడు వారి ప్రయాణాన్ని ముగించారు. 2020లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మహిళ ఖవ్లా అల్ రొమైతి నెలకొల్పిన 3 రోజుల, 14 గంటల, 46 నిమిషాల 48 సెకన్ల రికార్డును ఈ ఇద్దరు వ్యక్తులు అధిగమించారు.

తమ టైటిల్ చిరస్థాయిగా ఉంటుందని తాము ఆశించడం లేదన్నారు. ఈ రోజు ఒక రికార్డును బద్దలు కొట్టడంలో విజయం సాధించవచ్చు, రేపు మా రికార్డును మరొకరు బ్రేక్ చేస్తారు..అని మిత్రా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కి చెప్పారు .

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..