America: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన కుటుంబం సజీవదహనం!

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం ఈ ప్రమాదంలో సజీవ దహనం అయ్యింది. అట్లాంటా నుంచి డల్లాస్‌ వస్తుండగా వీరు ప్రయాణిస్తున్న కారును గ్రీన్‌కౌంటీ ఏరియాలో ఓ ట్రక్కు ఢీకొట్టింది.ట్రక్కు కారును వేగంగా ఢీకొట్టడంతో కారులో మంటలు చెలరేగి ఇద్దరు పిల్లలు సహా వెంకట్, తేజస్విని దంపతులు సజీవదహనం అయ్యారు.

America: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన కుటుంబం సజీవదహనం!
Ttd Accident

Updated on: Jul 07, 2025 | 10:00 PM

అమెరికాలో ఘోర ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం అయ్యారు. హైదరాబాద్‌కు చెందిన శ్రీవెంకట్, తేజస్వినీ దంపతులు తమ పిల్లలతో పాటు ఇటీవల వెకేషన్‌ కోసం అమెరికాలోని డల్లాస్‌లో ఉన్న తమ బంధువుల దగ్గరకు వెళ్లారు. ఈ క్రమంలోనే అట్లాంట ప్రాంతానికి వెళ్లి అక్కడ కుటుంబంతో కలిసి సరదాగా గడిపారు. అమెరికా అందాలను ఆస్వాధించారు. ఇక తమ వేకేషన్ పూర్తయిన తర్వాత అంట్లాంటా నుంచి కారులో తిరిగి డల్లాస్‌కు బయల్దేరారు.

అయితే వారు ప్రయాణిస్తున్న కారు గ్రీన్‌కౌంటీ ఏరియాలోకి రాగానే అటుగా వేగంగా వచ్చిన ఓ ట్రక్కు వాళ్ల కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ఉన్న శ్రీవెంకట్, తేజస్వినీ దంపతులు తహా తమ ఇద్దరు పిల్లలు సజీవ దహనం అయ్యారు.  ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న ట్రక్కును క్రేన్‌ సహాయంతో పక్కకు తీశారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.