Afghanistan: పరిస్థితి ఉద్రిక్తం.. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు.. అయిదుగురు దుర్మరణం

| Edited By: Janardhan Veluru

Aug 16, 2021 | 2:56 PM

కాబూల్ విమానాశ్రయంలో భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విమానాలు ఎక్కేందుకు వందలాది మంది ప్రయత్నించడంతో రద్దీని నియంత్రించేందుకు కాల్పులు జరిగాయి.

Afghanistan: పరిస్థితి ఉద్రిక్తం.. కాబూల్ విమానాశ్రయంలో కాల్పులు.. అయిదుగురు దుర్మరణం
Kabul Airport
Follow us on

కాబూల్ విమానాశ్రయంలో హృదయ విదారక పరిస్థితులు నెలకొన్నాయి. విమానాలు ఎక్కేందుకు వందలాది మంది ప్రయత్నించడంతో రద్దీని నియంత్రించేందుకు భద్రతా సిబ్బంది కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో అయిదుగురు మృతి చెందారని తెలుస్తోంది. దేశం తాలిబన్ల వశమైనందున విదేశాలకు అనేకమంది పారిపోతున్నారు. అయితే గుంపులను చెదర గొట్టేందుకు అమెరికా సైనికులు మొదట గాలిలోకి కాల్పులు జరిపారని వార్తలు వచ్చినప్పటికీ.. ఈ ఘటనలో 5 గురు మృతి చెందినట్టు తాజాగా తెలుస్తోంది.

కానీ వీరు కాల్పుల్లో మరణించారా లేక తొక్కిసలాటలోనా అన్నది తెలియడంలేదని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. మరో వైపు అమెరికా దళాల కాల్పుల్లో ముగ్గురు ఆఫ్ఘన్లు మరణించారని కూడా అంటున్నారు. ఏమైనా ఈ విమానాశ్రయంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: ఆఫ్ఘన్ లోని భారతీయులకు షాకింగ్ న్యూస్.. కాబూల్ ఎయిర్ స్పేస్ మూసివేత

హిందూ స్త్రీలు ఇతరుల నుండి ప్రత్యేకంగా నిలబెట్టే కుంకుమ బొట్టు ప్రాముఖ్యత ఏమిటంటే..