పెద్దల్ని ఎదిరించి ప్రేమ వివాహం.. అంతలోనే..
పెద్దల్ని ఎదిరించే పెళ్లి చేసుకోవడమే కాదు, అంతే ధైర్యంగా దాంపత్య జీవితాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి.
పెద్దల్ని ఎదిరించే పెళ్లి చేసుకోవడమే కాదు, అంతే ధైర్యంగా దాంపత్య జీవితాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలి. లేకపోతే విధి ఆడే ఆటలో సమిధలు కాక తప్పదు. తాజాగా తమిళనాడులో అటువంటి ఘటనే చోటుచేసుకుంది. భర్త తిట్టాడని భార్య ఆత్మహత్య చేసుకుంది. భార్య ఎడబాటును తట్టుకోలేకపోయాడో, లేక ఆమె మరణం తన పీకల మీదకు వస్తుందని భావించాడో భర్త కూడా ఆమె బాటనే ఎంచుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. ఈరోడ్ జిల్లా అందియూరు దగ్గర్లోని ఒరుచ్చేరికి చెందిన ఇలంగోవన్(23), తిరుచంగోడుకు చెందిన రమ్య(23) ఒకరినోకరు ప్రేమించుకున్నారు. పెళ్లికి పెద్దలు నో చెప్పడంతో ఇంట్లో నుంచి వెళ్లి వివాహం చేసుకున్నారు. మూడు నెలలుగా అందియూర్లో కాపురం ఉంటున్నారు.
సోమవారం పని ముగించుకుని ఇంటికొచ్చిన ఇలంగోవన్, రమ్య ఉరికి వేలాడుతూ ఉండటం చూసి దిగ్భ్రాంతి చెందాడు. కాసేపటికే అతను కూడా ఉరేసుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఈ ఇద్దరూ ఇంట్లో బయటకు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూడగా ఆత్మహత్య ఉదంతం వెలుగుచూసింది. ఉదయాన్నే ఇలంగోవన్ తనను తిట్టడంతో రమ్య తీవ్ర మనస్తాపానికి లోనైనట్టు ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయ్యింది. అందుకే ఆమె ఆత్మహత్య చేసుకోవడం, భయంతో ఇలంగోవన్ సైతం బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
Also Read :