‘అయోధ్య తీర్పు’ రాసిందెవరు..?

సాధారణంగా.. సుప్రీం కోర్టు ఆనవాయితీ ప్రకారం.. ఒక తీర్పు చదివితే.. ఆ తీర్పు రాసిందెవ్వరనేది.. ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. కానీ.. శనివారం.. అయోధ్య తీర్పులో జరిగింది మాత్రం రివర్స్. ఇది సున్నితమైన అంశమనే ఆ పేరును ప్రస్తావించలేదా..? లేక మరేదేమైనా కారణం ఉందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ అయోధ్య తీర్పు అనే చెప్పాలి. ఎన్నో ఉత్కంఠల నడుమ.. కొన్ని సంవత్సరాలుగా.. ఈ కేసుకు పరిష్కారం దొరకలేదు. ఎట్టకేలకు.. అయోధ్య తీర్పు వచ్చింది. ముందు […]

'అయోధ్య తీర్పు' రాసిందెవరు..?
Follow us

| Edited By:

Updated on: Nov 10, 2019 | 10:18 AM

సాధారణంగా.. సుప్రీం కోర్టు ఆనవాయితీ ప్రకారం.. ఒక తీర్పు చదివితే.. ఆ తీర్పు రాసిందెవ్వరనేది.. ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. కానీ.. శనివారం.. అయోధ్య తీర్పులో జరిగింది మాత్రం రివర్స్. ఇది సున్నితమైన అంశమనే ఆ పేరును ప్రస్తావించలేదా..? లేక మరేదేమైనా కారణం ఉందా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్ అయోధ్య తీర్పు అనే చెప్పాలి. ఎన్నో ఉత్కంఠల నడుమ.. కొన్ని సంవత్సరాలుగా.. ఈ కేసుకు పరిష్కారం దొరకలేదు. ఎట్టకేలకు.. అయోధ్య తీర్పు వచ్చింది. ముందు నుంచే.. తీర్పు ఏదైనా సరే.. దాన్ని అందరూ స్వాగతించాలని.. ప్రధాని మోదీ దగ్గరి నుంచి అధికారులందరూ.. ప్రజలను అప్రమత్తం చేస్తూ వచ్చారు. ఇందులో భాగంగా.. శనివారం.. ఎంతో చారిత్రాత్మకమైన.. సంచలనాత్మకమైన తీర్పును వెల్లడించారు జస్టిస్ రంజన్ గొగొయ్. దాదాపు అరగంట సేపు ఆ తీర్పును చదివి వినిపించారు.

పురావస్తు శాఖల ఆధారంగా.. అయోధ్య.. రాముడిదేనని.. అక్కడే ఆయన జన్మించాడని.. సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. అంతేకాకుండా.. 2.77 ఎకరాల్లో.. ఒక భాగంగా ఉన్న బాబ్రీ మసీదును కూడా కూల్చివేయొద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే.. ఈ తీర్పును.. ముస్లిం పెద్దలు కూడా స్వీకరించారు. దాదాపు 40 రోజులు వాదనలు విన్న సుప్రీం.. నవంబర్ 9న సంచలనాత్మకమైన తీర్పును ప్రకటించింది.

ఐదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనం విస్తృతమైన తీర్పునిచ్చింది. దాదాపు 1045 పేజీలున్న తుది తీర్పులోని కీలక అంశాలను జస్టిస్ రంజన్ గొగోయ్ చదివి వినిపించారు. దీంతో.. పాటు మరో 116 పేజీల అనుబంధాన్ని కూడా ప్రత్యేకంగా ఇవ్వడం ఈ తీర్పులోని మరో విశేషం. అయితే.. సాధారణంగా తీర్పు వెలువరించే సమయంలో.. ధర్మాసనం తరుపున ఆ తీర్పును రాసిన న్యాయమూర్తి ఎవరనేది కూడా ప్రకటిస్తారు. దాదాపు అరగంట సేపు ఆ తీర్పును చదివి వినిపించారు జస్టిస్ రంజన్ గొగోయ్. తీర్పు చదివిన తర్వాత.. మొదలు కానీ.. చివర కానీ.. ఆతీర్పు ఎవరు రాశారనే విషయం మాత్రం బయటపెట్టలేదు.

ఇది చాలా అసాధారణం.. సుప్రీం కోర్టుకు సంప్రదాయానికి భిన్నమైనదిగా కూడా చెప్పొచ్చు. సాధారణంగా.. ధర్మాసనం తరపున తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును పేర్కొంటారు. ఇలా.. ఇంత కీలకమైన కేసులో తీర్పు రాసిన న్యాయమూర్తి పేరును వెల్లడించని.. ఈ విధమైన తీర్పు మునుపెన్నడూ జరగలేదనే చెప్పాలి.