ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్లో తొలిసారి ఎన్నికలు… ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్
మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 43 డీడీసీ స్థానాల్లో ..25 కశ్మీర్లో ఉండగా..18 జమ్ములో ఉన్నాయి.
ఆర్టికల్ 370 రద్దు అనంతరం జమ్ముకశ్మీర్లో తొలిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. స్థానిక సమరంలో భాగంగా ఫస్ట్ఫేజ్ పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుంది. 43 డీడీసీలు, సర్పంచ్ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది.
మొత్తం 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశలో మొత్తం 1427 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మొత్తం 43 డీడీసీ స్థానాల్లో ..25 కశ్మీర్లో ఉండగా..18 జమ్ములో ఉన్నాయి. కట్టుదిట్టమైన భద్రత నడుమ..ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నికలు నిర్వహిస్తున్నారు ఎన్నికల అధికారులు.
డీడీసీ ఎన్నికలను అడ్డుకునేందుకు ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన భద్రతా దళాలు.. పటిష్ఠమైన నిఘా ఏర్పాటు చేశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పూర్తిస్థాయిలో గస్తీ నిర్వహిస్తున్నారు.
జమ్ముకశ్మీర్లోని 20 జిల్లాల్లో మొత్తం 280 స్థానాలకు 8 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 19 వరకు ఎన్నికలు పూర్తి కానున్నాయి. డిసెంబర్ 22న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
Jammu and Kashmir: Voting underway for the first phase of District Development Council (DDC) elections in the Union Territory
Visuals from Harwan area of the Srinagar district pic.twitter.com/lnznbGHNOu
— ANI (@ANI) November 28, 2020