Rishi Sunak: ఏటా 3వేల వీసాలు.. భారతీయులకు రిషి సునాక్ గుడ్‌న్యూస్‌..(Video)

 బ్రిటన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. భారత యువ ప్రొఫెషనల్స్‌కు ఏటా 3వేల వీసాలు అందించేలా..సరికొత్త పథకానికి ఆమోదం తెలిపారు UK ప్రధాని రిషి సునాక్‌. ఇండోనేషియా బాలిలో జి-20 సదస్సు వేదికగా.. ప్రధాని మోదీతో భేటీ అయిన కొద్ది గంటలకే ఈ ప్రకటన వెలువడింది. భారతీయ మూలాలున్న రిషి సునాక్‌.. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బ్రిటన్, భారత్ మధ్య […]

Rishi Sunak: ఏటా 3వేల వీసాలు.. భారతీయులకు రిషి సునాక్ గుడ్‌న్యూస్‌..(Video)

|

Updated on: Nov 17, 2022 | 9:24 AM



బ్రిటన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. భారత యువ ప్రొఫెషనల్స్‌కు ఏటా 3వేల వీసాలు అందించేలా..సరికొత్త పథకానికి ఆమోదం తెలిపారు UK ప్రధాని రిషి సునాక్‌. ఇండోనేషియా బాలిలో జి-20 సదస్సు వేదికగా.. ప్రధాని మోదీతో భేటీ అయిన కొద్ది గంటలకే ఈ ప్రకటన వెలువడింది. భారతీయ మూలాలున్న రిషి సునాక్‌.. బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీతో భేటీ కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం బ్రిటన్, భారత్ మధ్య వ్యాపార ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇది దోహదపడుతుందని తెలిపింది బ్రిటన్‌.

Follow us