పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్ట్‌పై ఉగ్రదాడి

|

Mar 22, 2024 | 6:31 PM

పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్ట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అత్యాధునిక ఆయుధాలు ధరించిన బలూచ్‌ తీవ్రవాదులు గ్వాదర్‌ పోర్ట్‌ అథారిటీ కాంప్లెక్స్‌లోకి చొచ్చుకెళ్లి కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రవాదులు మరణించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందికి, సాధారణ పౌరులకు ఏమైనా నష్టం జరిగిందా?

పాకిస్థాన్‌లోని గ్వాదర్‌ పోర్ట్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు. అత్యాధునిక ఆయుధాలు ధరించిన బలూచ్‌ తీవ్రవాదులు గ్వాదర్‌ పోర్ట్‌ అథారిటీ కాంప్లెక్స్‌లోకి చొచ్చుకెళ్లి కాల్పులు జరిపారు. వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. దీంతో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రవాదులు మరణించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ సందర్భంగా భద్రతా సిబ్బందికి, సాధారణ పౌరులకు ఏమైనా నష్టం జరిగిందా? అన్న విషయమై ఎటువంటి సమాచారం లేదు. పోర్ట్‌పై దాడికి పాల్పడింది తామేనని బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించుకుంది. పాకిస్తాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ తీవ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమంటూ వ్యాఖ్యలు చేసిన మరుసటి రోజే ఈ ఘటన జరిగింది. పాకిస్థాన్‌లోని అతిపెద్ద ప్రావిన్స్‌గా పిలిచే బలూచిస్థాన్‌ అనేక కొండలతో కూడిన ప్రాంతం. స్వాతంత్య్రం కోసం ఇక్కడ అనేక గ్రూపులు కొన్నేళ్లుగా తిరుగుబాటు చేస్తున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

డీప్‌ఫేక్‌పై ఇటలీ ప్రధాని కొరడా.. రూ.90 లక్షల పరువు నష్టం దావా

ఎన్నికల వేళ డిటెక్టివ్ లకు పెరుగుతున్న గిరాకీ !!

అన్నాచెల్లెళ్ల పెళ్లి !! ఎందుకు చేసుకున్నారో తెలుసా ??

Om Bheem Bush: ఓం భీమ్ బుష్‌ సినిమా ఎలా ఉందంటే ?? రివ్యూ మీరే చూసేయండి

Follow us on