ఎన్నికల వేళ డిటెక్టివ్ లకు పెరుగుతున్న గిరాకీ !!

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. అభ్యర్థులు, టికెట్లు కోరుతున్న ఆశావహులు, వారి ప్రత్యర్థులు, సహచరుల కదలికలపై రాజకీయ పార్టీలు దృష్టి పెడుతున్నాయి. ఇతర పార్టీల వ్యూహాలను పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ప్రైవేటు డిటెక్టివ్‌లను నియమించుకుంటున్నాయి. ఈ లోక్​సభ ఎన్నికల్లో ప్రైవేటు డిటెక్టివ్‌ ఏజెన్సీలకు భారీగా గిరాకీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఎన్నికల వేళ డిటెక్టివ్ లకు పెరుగుతున్న గిరాకీ !!

|

Updated on: Mar 22, 2024 | 6:28 PM

లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలతో దేశవ్యాప్తంగా రాజకీయ వేడి రాజుకుంది. అభ్యర్థులు, టికెట్లు కోరుతున్న ఆశావహులు, వారి ప్రత్యర్థులు, సహచరుల కదలికలపై రాజకీయ పార్టీలు దృష్టి పెడుతున్నాయి. ఇతర పార్టీల వ్యూహాలను పసిగట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం ప్రైవేటు డిటెక్టివ్‌లను నియమించుకుంటున్నాయి. ఈ లోక్​సభ ఎన్నికల్లో ప్రైవేటు డిటెక్టివ్‌ ఏజెన్సీలకు భారీగా గిరాకీ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికల సమయంలో రాజకీయ ఫిరాయింపులు, క్యాంపులు మార్చడం జరుగుతుంటాయి. అలాగే కీలక సమాచారాన్ని ప్రత్యర్థులకు అందించే అవకాశం ఉంటుంది. అలాంటి వారిని తెలుసుకునేందుకు, వారిపై నిఘా ఉంచే పనిని డిటెక్టివ్‌ ఏజెన్సీలకు రాజకీయ పార్టీలు అప్పగిస్తున్నాయట. ఎవరు పార్టీలు మారే అవకాశం ఉందనే విషయాన్ని గుర్తించడం ఈ డిటెక్టివ్​ పని. అనుకూలమైన ఫలితాల కోసం ఎంత ఖర్చుచేసేందుకైనా రాజకీయ పార్టీలు వెనకాడటం లేదు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అన్నాచెల్లెళ్ల పెళ్లి !! ఎందుకు చేసుకున్నారో తెలుసా ??

Om Bheem Bush: ఓం భీమ్ బుష్‌ సినిమా ఎలా ఉందంటే ?? రివ్యూ మీరే చూసేయండి

Follow us