కెనడాలో భారతీయులు అప్రమత్తంగా ఉండాలి.. భారతీయులను టార్గెట్‌ చేసే అవకాశం

|

Sep 21, 2023 | 8:27 PM

భారత్‌-కెనడా మధ్య దౌత్యయుద్దం మరింత ముదిరింది. కెనడాలో ఉన్న భారతీయ విద్యార్ధులు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం అడ్వైజరీని జారీ చేసింది. భారతీయ పౌరులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. కెనడాకు వెళ్లే భారతీయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. కెనడాలో రోజురోజుకు భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఖలిస్తాన్‌ తీవ్రవాదులకు కెనడా అడ్డాగా మారడం భారత్‌ను ఆందోళన కలిగిస్తోంది.

భారత్‌-కెనడా మధ్య దౌత్యయుద్దం మరింత ముదిరింది. కెనడాలో ఉన్న భారతీయ విద్యార్ధులు, పౌరులు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం అడ్వైజరీని జారీ చేసింది. భారతీయ పౌరులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరారు. కెనడాకు వెళ్లే భారతీయులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం సూచించింది. కెనడాలో రోజురోజుకు భారత వ్యతిరేక కార్యకలాపాలు పెరిగిపోతున్నాయి. ఖలిస్తాన్‌ తీవ్రవాదులకు కెనడా అడ్డాగా మారడం భారత్‌ను ఆందోళన కలిగిస్తోంది. కెనడాలో ఉన్న హిందువులు వెంటనే భారత్‌కు వెళ్లిపోవాలని , లేదంటే తీవ్ర పరిణమాలు ఉంటాయని ఖలిస్తాన్‌ సంస్థలు హెచ్చరించాయి. దీంతో భారత ప్రభుత్వం అలర్ట్‌ జారీ చేసింది. G20 సమ్మిట్‌ జరిగి పది రోజులు కానే లేదు.. అప్పుడే భారత్‌, కెనడా మధ్య ఉప్పు నిప్పు అన్నట్టుగా మారింది సీన్‌. G20 సదస్సుకు ఢిల్లీకి వచ్చిన కెనడా ప్రధాని ట్రూడో కడుపులో కత్తులు పెట్టుకుని.. ముఖంపై నవ్వుతో నటించినట్టు తాజాగా సంఘటనలను భట్టి స్పష్టమవుతోంది. ఖలిస్థానీ అంశం, ట్రూడో ఆరోపణలతో భారత్‌, కెనడా మధ్య ఉద్రికత్తలు చోటు చేసుకున్నాయి. తాజాగా కెనడాలోని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఆ దేశంలోని పౌరులు, విద్యార్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

విమాన టాయిలెట్‌లో సీక్రెట్ ఫోన్ కెమెరా !! మైనర్ బాలికకు చేధు అనుభవం

ల్యాండింగ్‌కు ముందే డోర్‌ తెరిచి.. తీవ్ర భయాందోళనకు గురైన ప్రయాణికులు

కరోనా పాజిటివ్‌తో బహిరంగంగా దగ్గినందుకు రెండువారాల జైలు శిక్ష !!

రూ.3వేల కోసం దారుణం.. చిరు వ్యాపారిని నగ్నంగా ఊరేగింపు

మిలాద్‌ ఉన్‌ నబీపై పాతబస్తీ ముస్లిం పెద్దల సంచలన నిర్ణయం

Follow us on