నేపాల్‌లో విమాన ప్రమాదం.. పైలెట్ ప్రాణాన్ని కాపాడిన ఓ కంటైనర్‌

|

Jul 29, 2024 | 9:28 PM

నేపాల్‌లోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలెట్‌ మనీష్‌ శాక్య ఒక్కరే వెంట్రుకవాసిలో ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అనుకోకుండా రెప్పపాటులో జరిగిన ఓ ఘటన అతడి ప్రాణాలను కాపాడింది. సహాయక బృందాలు తక్షణమే అక్కడికి చేరడంతో అతడిని ఆస్పత్రికి తరలించగలిగారు. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం మెయింటెనెన్స్‌ కోసం త్రిభువన్‌ ఎయిర్‌ పోర్టు నుంచి పోఖరకు వెళ్లేందుకు 11.15కు బయలుదేరింది.

నేపాల్‌లోని త్రిభువన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘోర ప్రమాదం నుంచి పైలెట్‌ మనీష్‌ శాక్య ఒక్కరే వెంట్రుకవాసిలో ప్రాణాలతో బయటపడ్డాడు. తీవ్రంగా గాయపడి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అనుకోకుండా రెప్పపాటులో జరిగిన ఓ ఘటన అతడి ప్రాణాలను కాపాడింది. సహాయక బృందాలు తక్షణమే అక్కడికి చేరడంతో అతడిని ఆస్పత్రికి తరలించగలిగారు. శౌర్య ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం మెయింటెనెన్స్‌ కోసం త్రిభువన్‌ ఎయిర్‌ పోర్టు నుంచి పోఖరకు వెళ్లేందుకు 11.15కు బయలుదేరింది. దానిలో 17 మంది టెక్నీషియన్లు, ఇద్దరు విమాన సిబ్బంది ఉన్నారు. గాల్లోకి ఎగిరిన నిమిషాల్లోనే అది కుడివైపునకు తిరిగి రన్‌వేకు తూర్పు దిశలో కూలిపోయింది. ఈ విమానం పక్కనే ఉన్న లోయలో కూలిపోయే ముందు ఒక కంటైనర్‌ను బలంగా ఢీకొంది. దీంతో విమానంలో పైలెట్‌ ఉండే కాక్‌పిట్‌ భాగం దానిలో చిక్కుకుపోయింది. మిగిలిన భాగాలు పక్కనే ఉన్న కొండపై పడి అగ్ని కీలల్లో చిక్కుకొన్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రపంచంలో భయంకర ఆర్థిక అసమానతలు.. ఆక్స్‌ఫామ్‌ నివేదికలో షాకింగ్‌ నిజాలు

ఇంట్లో చొరబడిన చిరుత !! తీవ్ర భయాందోళనలో స్థానికులు

పిచ్చి ముదరడం అంటే ఇదే !! వీడియో వైరల్ అవ్వాలని ఏకంగా రైలునే పట్టాలు తప్పించేశాడు

టైర్‌ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. అవుటర్‌పై ఆరేళ్ల బాలుడు మృ**తి..

26 మంది హ**త్య !! మృతదేహాలను నదిలోకి ఈడ్చుకెళ్లిన మొసళ్లు

Follow us on