పిచ్చి ముదరడం అంటే ఇదే !! వీడియో వైరల్ అవ్వాలని ఏకంగా రైలునే పట్టాలు తప్పించేశాడు
వీడియోలు వైరల్ కావాలనే పిచ్చి యువతలో ముదిరిపోయింది. వీడియోలు షూట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి గురించి మనం వార్తల్లో చదువుతూనే ఉన్నాం. కానీ, అమెరికా నెబ్రస్కా రాష్ట్రంలోని లాంక్సటార్ కౌంటలోని ఓ 17 ఏళ్ల కుర్రాడికి యూట్యూబ్లో వీడియో వైరల్ చేయాలని కోరిక పుట్టింది. ఇంకేముంది.. ఏప్రిల్లో మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైలు క్రాసింగ్ వద్దకు వెళ్లాడు.
వీడియోలు వైరల్ కావాలనే పిచ్చి యువతలో ముదిరిపోయింది. వీడియోలు షూట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి గురించి మనం వార్తల్లో చదువుతూనే ఉన్నాం. కానీ, అమెరికా నెబ్రస్కా రాష్ట్రంలోని లాంక్సటార్ కౌంటలోని ఓ 17 ఏళ్ల కుర్రాడికి యూట్యూబ్లో వీడియో వైరల్ చేయాలని కోరిక పుట్టింది. ఇంకేముంది.. ఏప్రిల్లో మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైలు క్రాసింగ్ వద్దకు వెళ్లాడు. అక్కడ రైళ్ల మార్గాలను నిర్దేశించే స్విచ్ల లాక్ తీసి వాటిల్లో మార్పులు చేశాడు. సమీపంలో తన కెమెరా ట్రైపాడ్ అమర్చి కాచుకొని కూర్చున్నాడు. ఇంతలో బీఎన్ఎస్ఎఫ్ సంస్థకు చెందిన రెండు లోకోమోటీవ్లు, ఐదు బోగీలు వచ్చాయి. ఆ డ్రైవర్ ఏం జరిగిందో గుర్తించే సమయానికి అవి పట్టాలు వెంటనే ఆ బాలుడు రైల్వే అధికారులకు ఫోన్ చేసి ప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. కీలక స్విచ్లను మార్చినట్లు గుర్తించారు. దీంతో వారికి అనుమానం వచ్చి బాలుడిని విచారించగా.. తాను పట్టాలు తప్పుతున్న రైలు వీడియో చిత్రీకరించినట్లు తెలిపాడు. స్విచ్లలో మార్పులతో తనకు సంబంధం లేదని బుకాయించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టైర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. అవుటర్పై ఆరేళ్ల బాలుడు మృ**తి..
తక్కువ ఖర్చుతో యూరప్ ఎలా చుట్టేయాలి? కంప్లీట్ ట్రావెల్ గైడ్
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం

