పిచ్చి ముదరడం అంటే ఇదే !! వీడియో వైరల్ అవ్వాలని ఏకంగా రైలునే పట్టాలు తప్పించేశాడు
వీడియోలు వైరల్ కావాలనే పిచ్చి యువతలో ముదిరిపోయింది. వీడియోలు షూట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి గురించి మనం వార్తల్లో చదువుతూనే ఉన్నాం. కానీ, అమెరికా నెబ్రస్కా రాష్ట్రంలోని లాంక్సటార్ కౌంటలోని ఓ 17 ఏళ్ల కుర్రాడికి యూట్యూబ్లో వీడియో వైరల్ చేయాలని కోరిక పుట్టింది. ఇంకేముంది.. ఏప్రిల్లో మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైలు క్రాసింగ్ వద్దకు వెళ్లాడు.
వీడియోలు వైరల్ కావాలనే పిచ్చి యువతలో ముదిరిపోయింది. వీడియోలు షూట్ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి గురించి మనం వార్తల్లో చదువుతూనే ఉన్నాం. కానీ, అమెరికా నెబ్రస్కా రాష్ట్రంలోని లాంక్సటార్ కౌంటలోని ఓ 17 ఏళ్ల కుర్రాడికి యూట్యూబ్లో వీడియో వైరల్ చేయాలని కోరిక పుట్టింది. ఇంకేముంది.. ఏప్రిల్లో మోన్రోయ్ అనే ప్రాంతం వద్ద ఉన్న రైలు క్రాసింగ్ వద్దకు వెళ్లాడు. అక్కడ రైళ్ల మార్గాలను నిర్దేశించే స్విచ్ల లాక్ తీసి వాటిల్లో మార్పులు చేశాడు. సమీపంలో తన కెమెరా ట్రైపాడ్ అమర్చి కాచుకొని కూర్చున్నాడు. ఇంతలో బీఎన్ఎస్ఎఫ్ సంస్థకు చెందిన రెండు లోకోమోటీవ్లు, ఐదు బోగీలు వచ్చాయి. ఆ డ్రైవర్ ఏం జరిగిందో గుర్తించే సమయానికి అవి పట్టాలు వెంటనే ఆ బాలుడు రైల్వే అధికారులకు ఫోన్ చేసి ప్రమాదం జరిగిందని సమాచారం ఇచ్చాడు. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. కీలక స్విచ్లను మార్చినట్లు గుర్తించారు. దీంతో వారికి అనుమానం వచ్చి బాలుడిని విచారించగా.. తాను పట్టాలు తప్పుతున్న రైలు వీడియో చిత్రీకరించినట్లు తెలిపాడు. స్విచ్లలో మార్పులతో తనకు సంబంధం లేదని బుకాయించాడు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
టైర్ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు.. అవుటర్పై ఆరేళ్ల బాలుడు మృ**తి..
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

